టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కెరియర్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉందని చెప్పొచ్చు. రెండేళ్ల క్రితం కొత్త హీరోయిన్స్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న టైంలో కాజల్ పెట్టా బేడా సర్ధేయడమే అనుకున్నారు. కాని ఖైది నంబర్ 150, నేనే రాజు నేనే మంత్రి సినిమాల ఫలితాలు మళ్లీ కాజల్ కెరియర్ ను సెట్ రైట్ చేశాయి.   


అయితే ఈమధ్య చేసిన కవచం, సీత, రణరంగం సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యాయి. అయినా సరే సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా కాజల్ వరుస ఛాన్సులు అందుకుంటుంది. తేజ డైరక్షన్ లో లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కాజల్ అగర్వాల్.


ఆ సినిమా తర్వాత మళ్లీ నేనే రాజు నేనే మంత్రి, సీత సినిమాలతో తేజ డైరక్షన్ లో సినిమాలు చేసింది. తనకు తేజ డైరక్షన్ లో చేయడం చాలా కంఫర్టబుల్ అని చెప్పుకొచ్చింది కాజల్. ఏ హీరోయిన్ కు అయినా సరైన పాత్ర దొరికితేనే వారిలోని సత్తా బయటపడుతుంది. కొంతమంది దర్శకులు హద్ధులు దాటి నటించమని ప్రోత్సహిస్తారు. అలాంటి వారిలో తేజ ఒకరని చెప్పారు కాజల్. నటిగా తెర మీద అందంగా కనిపించాలని కోరిక ఉండేదని ఆ విషయాన్ని గమనించి తేజా తనకు మంచి సలహాలు ఇచ్చారని అన్నారు కాజల్.


గత సినిమాలతో పోల్చితే ఎమోషనల్ సీన్స్ లో తన పర్ఫార్మెన్స్ బాగుందని. హద్దు దాటితేనే అసలు మజా ఏంటన్నది తెలుస్తుందని.. తనకు ఈ విషయం ఇప్పటికి అర్ధమైందని తెలిపింది కాజల్. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్న కాజల్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ మూవీలో కాజల్ ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది.   




మరింత సమాచారం తెలుసుకోండి: