ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కడ చూసినా ‘సాహూ’మానియా నడుస్తుంది.  బాహుబలి 2 తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సాహూ’ మూవీ పైనే అందరి దృష్టి.  వాస్తవానికి మిర్చి సినిమా వరకు ప్రభాస్ ఒక సాధారణ తెలుగు హీరోగా మాత్రం అందరికీ తెలుసు. కానీ రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక మూవీ ‘బాహుబలి, బాహుబలి 2’ తర్వాత ప్రభాస్ రేంజ్ ఏకంగా జాతీయ స్థాకియి పెరిగిపోయింది.  ఈ మద్య కాలంలో ఒక తెలుగు హీరో ఆ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం ప్రభాస్ కే చెల్లింది. 

ఇదే ఇప్పుడు ప్రభాస్ తదుపరి సినిమాలపై ప్రభావం చూపిస్తుంది.  ఆయన నటించే సినిమాలు జాతీయ స్థాయిలో ఉండాలని అటు అభిమానులు, దర్శక,నిర్మాతలు కోరుకుంటున్నారు.  ప్రస్తుతం సుజిత్  దర్శకత్వంలో వస్తున్న ‘సాహూ’ మూవీపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అందుకు తగ్గట్టుగానే ఈ మూవీలో ఎక్కువ శాతం బాలీవుడ్ నటులు ఉన్నారు. ‘సాహూ’ మూవీలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. మరికొన్ని ముఖ్యపాత్రల్లో జాకీష్రాఫ్, నీల్ నితిన్, మందిరాబేడీ లు నటిస్తున్నారు.

ఈ మద్య రిలీజ్ అయిన సాహూ ట్రైలర్ సోషల్ మీడియాలో రికార్డుల మోత మోగించింది.  అయితే ఈ సినిమా దర్శకుడు సుజీత్ ‘సాహూ’ జాతీయ స్థాయిలో మెప్పిస్తుందని చెబుతున్నారు. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ గురించి హీరో ప్రభాస్ మాట్లాడుతూ.. ‘సాహో’ విషయంలో టెన్షన్ పడుతున్నారా? అని చాలామంది అడుగుతున్నారు.

ఇంత భారీ బడ్జెట్ తో సినిమా చేశాక ఏ రేంజ్ టెన్షన్ ఉంటుందో కొత్తగా చెప్పాలా? 'సాహో' కోసం రెండేళ్ల సమయాన్ని వెచ్చించాను ఆ స్థాయిలో మెప్పిస్తుందని భావిస్తున్నాను..అయితే అంతా ప్రేక్షకుల చేతిలోనే ఉంటుంది అని అన్నారు.  ఇంతకాలం పాటు సాంకేతిక నిపుణులు పడిన కష్టం గురించీ, ఖర్చుకు వెనకాడకుండా ముందుకెళ్లిన నిర్మాతల గురించిన ఆలోచన ఉంటుంది. ఈ సినిమా హిట్ చేయాలని ప్రతి ఒక్కరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నారు ప్రభాస్. 


మరింత సమాచారం తెలుసుకోండి: