రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ తొలిసారి తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అవుతున్న సినిమా సాహో. యువి క్రియేషన్స్ బ్యానర్ పై రూ.350 కోట్లకు పైగా భారీ ఖర్చుతో, అత్యున్నత సాంకేతిక ప్రమాణతో, యువ దర్శకుడు సుజిత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయి, దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్లో సాహో పై అంచనాలు అమాంతం పెంచేసింది. 

ఇకపోతే ఈ సినిమా నుండి ఇటీవల ఈ సినిమా ప్రి రిలీజ్ వేడుక సందర్భంగా ప్రదర్శించిన బ్యాడ్ బాయ్ సాంగ్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. అలా రిలీజ్ అయిన వెంటనే, ఈ సాంగ్ కు వీక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పటివరకు ఈ సాంగ్ 20 మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది. బాలీవుడ్ నటి జాక్వలీన్ ఫెర్నాండేజ్, ఈ స్పెషల్ సాంగ్ లో ప్రభాస్ ప్రక్కన నటించింది. కుర్రకారును ఆకట్టుకునేలా వెస్ట్రన్ స్టైల్ అవుట్ ఫిట్స్ తో, వండర్ఫుల్ లొకేషన్స్ లో చిత్రీకరించిన ఈ సాంగ్ లో ప్రభాస్, జాక్వలీన్ ల జోడీ చేసిన పెర్ఫార్మన్స్ కు విపరీతమైన అప్లాజ్ వస్తోంది. ఇకపోతే ఈ సాంగ్ రిలీజ్ తరువాత సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరగడంతో, 

రేపు తమ సినిమా రిలీజ్ తరువాత, ఆ అంచనాలు తప్పకుండా అందుకుంటాం అని సాహో టీమ్ ధీమా వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముకేశ్, కోలీవుడ్ నటుడు అరుణ్ విజయ్, మురళి శర్మ, వెన్నెల కిశోర్ తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని యువ సంగీత దర్శకుడు జీబ్రాన్ అందిస్తుండగా, మది కెమెరామ్యాన్ గా వ్యవహరిస్తున్నారు. కాగా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఈ నెల 30వ తేదీన భారీ స్థాయిలో, అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు.....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: