హీరో రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ల కలయికలో ఇటీవల వచ్చిన సూపర్ హిట్ మూవీ ఇస్మార్ట్ శంకర్. నిజానికి గత కొద్దికాలంగా సరైన హిట్స్ లేక ఎంతో సతమతం అవుతున్న రామ్, పూరి లకు ఈ ఒక్క సినిమా సూపర్ హిట్ సాధించి మాంచి కిక్ ని ఇచ్చింది. రిలీజ్ అయిన తొలిరోజు నుండి దాదాపుగా అన్ని ప్రాంతాల నుండి హిట్ టాక్ సంపాదించిన ఈ సినిమా, ఎక్కువగా బి, సి సెంటర్స్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. రామ్ సరసన సూపర్ బ్యూటీస్ నిది అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాను, 

నటి ఛార్మితో కలిసి పూరి జగన్నాథ్, తన పూరి టూరింగ్ టాకీస్ బ్యానర్ పై నిరించడం జరిగింది. పూరి మార్క్ డైలాగ్స్ మరియు టేకింగ్ కు రామ్ స్టైల్ అఫ్ యాక్షన్, ఫైట్స్, డాన్స్ లు జతకలిసి ఇస్మార్ట్ కు ఇంతటి భారీ విజయాన్ని అందించాయనే చెప్పాలి. ఎక్కువగా యూత్ మరియు మాస్ ఆడియన్స్ ను అలరించిన ఈ సినిమాతో రామ్ కు మంచి మాస్ ఇమేజ్ కూడా లభించింది. ఇకపోతే బిజినెస్ పరంగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ.17.5 కోట్లకు అమ్మడుపోగా, ఓవర్ ఆల్ గా క్లోజింగ్ సమయానికి ఈ సినిమా రూ.61.5 కోట్ల గ్రాస్ కలెక్షన్ ను రాబట్టినట్లు తెలుస్తోంది. అంటే ఈ సినిమా బయ్యర్లకు ఏకంగా రెండు వందల శాతం లాభాలు తెచ్చిపెట్టిందన్నమాట. 

ఒకరకంగా ఈ మధ్య కాలంలో బయ్యర్లకు ఇంత అత్యధిక స్థాయిలో లాభాలు తెచ్చిపెట్టిన సినిమా ఇదేనని, అలానే ఈ ఏడాది ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాల్లో ఇస్మార్ట్, అత్యధిక స్థాయి కలెక్షన్స్ సాధించిన రెండవ సినిమాగా నిలిచిందని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. ఇక ఈ సినిమా ఇచ్చిన ఊపుతో అప్పుడే ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కనున్న డబుల్ ఇస్మార్ట్ సినిమాకు సంబంధించి పనులను పూరి మొదలెట్టారట. అయితే ప్రస్తుతం ఆయన, విజయ్ దేవరకొండతో తీయనున్న సినిమా అనంతరం, ఈ డబుల్ ఇస్మార్ట్ మూవీ ని ప్రారంభిస్తారని సమాచారం....!!


మరింత సమాచారం తెలుసుకోండి: