తెలుగులో డిజాస్టర్ డైరక్టర్ అయిన మెహర్ రమేష్ చేసింది నాలుగు సినిమాలే అయినా అతనితో సినిమా అంటే హీరోలు, నిర్మాతలు అయ్య బాబోయ్ అనుకునే పరిస్థితి వచ్చింది. కంత్రి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన మెహర్ రమేష్ బిల్లాతో పర్వాలేదు అనిపించగా.. శక్తి, షాడో సినిమాల ఫ్లాప్ తో కెరియర్ లో వెనుకపడ్డాడు. 


ఇండస్ట్రీలో అందరితో మంచి పరిచయాలున్న మెహర్ రమేష్ అడపాదడపా యాడ్స్ ను డైరెక్ట్ చేస్తూ వస్తున్నాడు. ఇన్నాళ్లకు అతనికి మళ్లీ డైరక్షన్ ఛాన్స్ వచ్చిందట. అయితే అతను చేసేది సినిమా కాదు వెబ్ సీరీస్ అని తెలుస్తుంది. ఈ వెబ్ సీరీస్ కు నిర్మాతగా మహేష్ వ్యవహరిస్తాడని సమాచారం. 


ఎంబి ప్రొడక్షన్స్ లో మహేష్ నిర్మాతగా వెబ్ సీరీస్ ప్లానింగ్ లో ఉన్నారు. అయితే మహేష్ సతీమణి నమ్రత ప్రొడక్షన్ విషయాలను చూసుకుంటుంది. మెహర్ రమేష్ తో సినిమా అంటే భయపడొచ్చు అందుకే వెబ్ సీరీస్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చారు. సినిమా మేకింగ్ లో భారీతనం చూపించే మెహర్ రమేష్ ఈ అవకాశాన్ని అయినా సక్సెస్ ఫుల్ చేసుకుంటాడో లేదో చూడాలి. మహేష్ నిర్మతగా వ్యవహరించే ఈ వెబ్ సీరీస్ కు మొదట టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ చేస్తాడని అన్నారు. కాని మెహర్ రమేష్ కు ఆ ఛాన్స్ వరించింది.       


ఇప్పటికే ఎంబి ప్రొడక్షన్స్ లో అడివి శేష్ హీరోగా మేజర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ఇప్పటికే షూటింగ్ మొదలవగా ఈ ఇయర్ ఎండింగ్ మూవీ రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది. హీరోగా వరుస సినిమాలు చేస్తూనే నిర్మాతగా ఫుల్ టైం గా సినిమాలు, వెబ్ సీరీస్ లు ప్లాన్ చేస్తున్నాడు మహేష్. మరి నిర్మాతగా మహేష్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: