టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మతగా రూపొందుతున్న ఈ సినిమాపై టాలీవుడ్ సహా మిగతా భాషల్లోని సినిమా అభిమానుల్లోనూ మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే నిన్న ప్రేక్షకుల ముందుకు  వచ్చిన ఈ సినిమా టీజర్ కు మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం బ్రహ్మరథం పడుతున్నారు. ఇక రేపు, మెగాస్టార్ తన 64 వ జన్మదినాన్ని జరుపుకోనున్న సందర్భంగా, నేడు మెగాస్టార్ బర్త్ డే సెలెబ్రేషన్స్ ని హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో గ్రాండ్ గా అరెంజ్ చేసారు. యాంకర్ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ వేడుకలో తొలుత మెగాస్టార్ నటించిన పలు సినిమాల్లోని పాటలకు వేసిన డ్యాన్సులు అందరినీ ఆకర్షించాయి. 

మెగా ఫ్యాన్స్ తో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సహా ఆయన కుటుంబసభ్యులందరూ పాల్గొన్న ఈ వేడుకకు విచ్చేసిన ప్రత్యేక అతిథుల్లో ఒకరైన జనసేన పార్టీ నేత తోట చంద్రశేఖర్, మెగాస్టార్, అలానే పవర్ స్టార్ పై తనదైన శైలిలో పొగడ్తలు కురిపించారు. చిన్న నటుడి స్థాయి నుండి ఒక్కొక్కటిగా మెట్లు ఎక్కుతూ, నేడు ఇంతటి అత్యున్నత  స్థానానికి చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి గారు, ఎందరికో స్ఫూర్తి దాయకం అని, అలానే ఆయన కేవలం అద్భుతమైన నటుడు మాత్రమే కాదు, మంచి మనసున్న మనిషి కూడా అని అన్నారు. ఇక ఆకాశంలో ఎన్ని తారలు ఉన్నప్పటికీ భూమిపై అద్వితీయంగా వెలిగే రెండు తారలైన మెగాస్టార్, పవర్ స్టార్ లను ఎవరూ ఢీకొట్టలేరని ఆయన అన్నారు. 2009వ సంవత్సరంలో మెగాస్టార్ నెలకొల్పిన ప్రజారాజ్యం పార్టీ సమయం నుండి తనకు ఆయనతో మంచి అనుబంధం ఉందని, 

సామజిక న్యాయం కోసం నిజంగా  పోరాడిన గొప్ప వ్యక్తి మెగాస్టార్ అని చెప్పారు. అయితే కొన్ని అనివార్య కారణాల వలన ప్రజారాజ్యం పార్టీ ద్వారా ఆయన అనుకున్నవి సఫలం కాలేదని, ప్రస్తుతం అంతటి పోరాట పటిమ కేవలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిలోనే ఉందని, కాబట్టి చిరంజీవి గారు కలగన్నట్లు ప్రసంక్షేమమే ద్యేయంగా ముందుకు సాగె పవన్,  రాబోయే రోజుల్లో అన్నయ్య కలను నిజం చేయాలని ఆశిస్తుట్లు చెప్పారు చంద్రశేఖర్. ఇక ఎప్పుడూ అందరి మంచిని కోరుకునే మెగాస్టార్, ఇటువంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: