‘సాహో’ రిజల్ట్ గురించి ప్రభాస్ టెన్షన్ పడుతున్న విషయం ఓపెన్ సీక్రెట్. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈమూవీ విడుదలరోజు ప్రభాస్ ఎక్కడ ఉంటాడు అంటూ అప్పుడే ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. 

ఈ మూవీని ప్రమోట్ చేస్తూ అనేక హిందీ ఛానల్స్ నిర్వహించే కార్యక్రమాలలో పాల్గొంటున్న ప్రభాస్ ఈరోజు త్రివేండ్రం వెళ్ళి అక్కడ ‘సాహో’ మళయాళ వర్షన్ ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొని ఆతరువాత చెన్నై బెంగుళూరులలో ఈ మూవీ ప్రమోషన్ చేయబోతున్నాడు. తెలుస్తున్న సమాచారం మేరకు ప్రభాస్ ఈ నెల 25 తారీఖు ప్రాంతంలో దుబాయ్ వెళ్ళి అక్కడ ‘సాహో’ ప్రమోషన్ కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో పాల్గొని ఆ తరువాత 27వ తారీఖుకు ప్రభాస్ లండన్ వెళ్తాడని సమాచారం.

ఈ మూవీ ప్రమోషన్ నిమిత్తం ఈ నెల 29న లండన్ లో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని ప్రభాస్ ‘సాహో’ విడుదల రోజున లండన్ లో ఉంటాడని వార్తలు వస్తున్నాయి. దీనితో ‘సాహో’ మ్యానియాతో తెలుగు రాష్ట్రాలలో జరిగే హడావిడి ఏమాత్రం పట్టించుకోకుండా ప్రభాస్ లండన్ లో ‘సాహో’ విడుదల రోజున కూల్ గా ఉండబోతున్నట్లు టాక్. 

లండన్ ట్రిప్ తరువాత అవసరం అనుకుంటే ప్రభాస్ సెప్టెంబర్ ఒకటి రెండు తారీఖులలో అమెరికాకు వెళ్ళి ఈ సినిమాను అక్కడ ప్రమోట్ చేసే ఆస్కారం ఉంది. దీనితో ‘సాహో’ ఫలితం పూర్తిగా తెలిసిన తరువాత మాత్రమే ప్రభాస్ తిరిగి ఇండియా వస్తాడు అన్న స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. ‘సాహో’ రిజల్ట్ గురించి ప్రభాస్ అభిమానులతో పాటు ఈ మూవీని కొనుక్కున్న బయ్యర్లు కూడ టెన్షన్ పడుతుంటే ప్రభాస్ తన టెన్షన్ ను బయట పడనీయకుండా ఇలా బిజీగా ప్రపంచ పర్యటన చేస్తూ ప్రభాస్ తన టెన్షన్ ను బయట పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అని అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: