బిగ్ బాస్ లో బుధవారం జరిగిన ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ తమ టాలెంట్ ని చూపించి ప్రేక్షకులకి వినోదాన్ని పంచారు. ప్రతీ కంటెస్టెంట్ తమకున్న ప్రతిభని అందరి ముందు ప్రదర్శించి తామేంటో నిరూపించుకున్నారు. అయితే హౌస్ మెంబర్స్ అందరూ సెలెబ్రిటీలే కాబట్టి వాళ్ళ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకున్న వ్యక్తి మహేష్ విట్ట. హౌస్ లో తనకి జరిగిన అనుభవాలని ఒక స్కిట్ లాగా చేసి ప్రేక్షకులకి తానేంటో తెలియజేసే ప్రయత్నం చేశాడు.


హౌస్ లో ఇప్పటి వరకు తనకి రెండు చేదు అనుభవాలు ఉన్నాయి. వాటి వల్ల జనాల్లో అతని మీద నెగెటివిటీ పెరిగింది.వరుణ్ తో జరిగిన గొడవ సమసి పోయిందని అనుకుంటే, పుల్లలు పెడ్తాడు అనే ట్యాగ్ వచ్చి చేరింది. ఈ విషయం మీద మాట్లాడుతూ,నేనేక్కడ పుల్లలు పెట్టాను, నా వల్ల ఎవరు కొట్టుకున్నారంటూ బిగ్ బాస్ ని ప్రశ్నించాడు. నిజం చెప్పాలంటే అది బిగ్ బాస్ ని ప్రశ్నించినట్టు మాత్రమే కాదు.


అక్కడున్న కంటెస్టెంట్స్ ని అలాగే, షో చూస్తున్న ప్రేక్షకులని ప్రశ్నించినట్టు. తానేమీ తప్పు చేయలేనని అందరికీ తెలియజేసే ప్రయత్నం చేశాడు. ఇదే విషయాన్ని కంటెస్టెంట్స్ తో పంచుకుంటే, అది ప్రేక్షకుల దాకా చేరుతుందో, లేదో అదీగాక కంటెస్టెంట్స్ కూడా మహేష్ చెప్పేది వినడానికి రెడీ ఉంటారో లేదో తెలియదు. దాంతో మహేష్ తెలివిగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ని ఈ విధంగా ఉపయోగించుకున్నాడు.


స్వతాహాగా రైటర్ అయిన మహేష్ ఈ స్కిట్ ద్వారా తనలోని రచయితను బయటకు తీసుకు వచ్చాడు. దీంతో మహేష్ పై ఉన్న నెగెటివిటీ పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంది.  టాస్క్ ని ఈ రకంగా కూడా వాడుకోవచ్చని నిరూపించిన మహేష్ ని మెచ్చుకోవచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: