‘డియర్ కామ్రేడ్’ ఫలితంతో నిరాశలోకి వెళ్ళిపోయిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటిస్తున్న మూవీ విషయంలో చాల జాక్రత్తలు తీసుకుంటున్నాడు. అయినప్పటికీ ఈ మూవీ ఫలితం ఎలా ఉన్నా షాక్ అవ్వకూడదు అన్న ఉద్దేశ్యంతో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఒక మాస్ ఎంటర్ టైనర్ కు లైన్ క్లియర్ చేసిన విషయం తెలిసిందే. 

పూరీ ఈ సినిమాను చాల వేగంగా తీస్తాడు కాబట్టి ఈ మూవీ షూటింగ్ ను ఈ ఏడాది చివరిలో మొదలుపెట్టి వచ్చే ఏడాది జూన్ జూలై మాసాలలో విడుదల అయ్యేవిధంగా విజయ్ మాష్టర్ ప్లాన్ వేసాడు. అయితే ఇప్పుడు ఆ ప్లాన్ కు విజయ్ గతంలో వ్రాసి ఇచ్చిన ఒక ఎగ్రిమెంట్ ప్రతిబంధకం అవుతుందా అంటూ ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. 

విజయ్ దేవరకొండ టాప్ హీరో అవ్వక ముందు ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ కు మూడు సినిమాలను చేస్తానని ఎగ్రిమెంట్ వ్రాసి ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే విజయ్ ఆ బ్యానర్ లో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ‘మహానటి’ సినిమాలలో నటించినా మరో సినిమాలో నటించవలసిన బాధ్యత విజయ్ వ్రాసి ఇచ్చిన ఎగ్రిమెంట్ రీత్యా ఉందని టాక్. 

దీనితో దర్శకుడు నాగ్ అశ్విన్ వచ్చే ఏడాది మొదట్లో మొదలు పెట్టవలసిన మూవీని విజయ్ తో తీయడానికి రంగం సిద్ధం చేసుకుని తనకు విజయ్ డేట్స్ కావాలని విజయ్ పై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఈ మూవీని అశ్వినీ దత్ నిర్మాతగా నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో తన ఎగ్రిమెంట్ రీత్యా విజయ్ తన డేట్స్ ను నాగ్ అశ్విన్ కు ఇస్తే పూరీ జగన్నాథ్ మూవీ ఆలస్యం అయ్యే ఆస్కారం ఉంది. దీనితో పూరీ సినిమాను ముందు చేసి ఆతరువాత అశ్వినీ దత్ సినిమాను చేస్తాను అంటూ విజయ్ నాగ్ అశ్విన్ తో రకరకాల రాయబారాలు చేస్తున్నట్లు సమాచారం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: