అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. 2020 సంక్రాంతికి ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా, దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. 
 
అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలోని సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ను తీసుకోవాలని సంప్రదించాడట నిర్మాత దిల్ రాజు. కానీ ఈ సినిమాలో నటించటానికి అలియా భట్ ఒప్పుకోలేదని సమాచారం. అలియా భట్ ఒప్పుకోకపోవటంతో బాలీవుడ్ కు చెందిన మరో హీరోయిన్ ను దిల్ రాజు సంప్రదిస్తున్నాడని తెలుస్తోంది. 
 
అలియాభట్ ప్రస్తుతం రామ్ చరణ్ సరసన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా తరువాత టాలీవుడ్లో అవకాశాలొచ్చినా ఈమెకు టాలీవుడ్ సినిమాల్లో నటించే ఉద్దేశం లేదని తెలుస్తోంది. అల వైకుంఠపురములో షూటింగ్ పూర్తయిన వెంటనే అల్లు అర్జున్ సుకుమార్, వేణు శ్రీరామ్ దర్శకత్వంలోని సినిమాలు మొదలుపెట్టబోతున్నాడని సమాచారం. 2020 సంక్రాంతి పండుగకు అల వైకుంఠపురములో విడుదల కాబోతుంది. 
 
ఇప్పటికే విడుదలైన అల వైకుంఠపురములో ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. దువ్వాడ జగన్నాథం సినిమా తరువాత అల్లు అర్జున్, పూజా హెగ్డే ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలోని  సెట్ కోసం 5 కోట్ల రుపాయలు ఖర్చు పెడుతున్నారు నిర్మాతలు. ఈ సినిమాలో పూజా హెగ్డే అలకనంద అనే పాత్రలో కనిపించబోతుంది. అలనాటి హీరోయిన్ టబు ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తోంది. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. 


 



మరింత సమాచారం తెలుసుకోండి: