ఈ మద్య టాలీవుడ్ లో కొత్త దర్శకులు సూపర్ హిట్ సినిమాలు తీస్తూ తమకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంటున్నారు. సీనియర్ దర్శకులకు పోటీగా వీరు తీస్తున్న సినిమాలకు ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు. పెళ్లిచూపులు సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’సినిమాలో నటించాడు.  ఈ మూవీకి కొత్త దర్శకుడు సందీప్ వంగా. 

మొదట ఈ మూవీ స్టోరీ పలువురు నిర్మాతలకు చెప్పినా ఎవరూ పట్టించుకోకపోవడంతో స్వియ నిర్మాణంలో ఈ మూవీ తీశారు.  అయితే మొదట అర్జున్ రెడ్డి మూవీపై రక రకాల విమర్శలు వచ్చాయి. ఇందులో ఎక్కువ బోల్డ్ కంటేంట్, డైలాగ్స్ ఉన్నాయని, లిప్ లాక్ సీన్లు అసభ్యంగా ఉన్నాయని ఎన్నో విమర్శలు వచ్చాయి. కానీ ఒక్క వారంలోనే సీన్ రివర్స్ అయ్యింది..ఈ మూవీ మంచి లవ్ స్టోరీ అంటూ యూత్ కనెక్ట్ అయ్యారు. ఒక్కసారే బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగించి లాభాల పంట పండింది. 

ఈ మూవీతో విజయ్ దేవరకొండ రేంజ్ ఎక్కడికో వెళ్లింది.  అయితే అర్జున్ రెడ్డి రిమేక్ గా బాలీవుడ్ లో కబీర్ సింగ్ సినిమాగా రిలీజ్ అయ్యింది. బాలీవుడ్ లో కూడా సందీప్ వంగా నే దర్శకత్వం వహించారు.  ఈ మూవీ ఏకంగా రెండు వందల కోట్ల క్లబ్ లో చేరింది.  తాజాగా సందీప్ వంగ ఇంట విషాదం చోటు చేసుకుంది. 

ఈ డైరెక్టర్ మాతృమూర్తి వంగా సుజాత గురువారం తెల్లవారు జామున తుది శ్వాసను విడిచారు, తెలంగాణలోని వరంగల్, వెంకటయ్య కాలనిలో ఉంటున్న ఆమె ఇంట్లోనే తుది శ్వాసను విడిచినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  ప్రస్తుతం మరో కథను సిద్ధం చేసే పనుల్లో ఉన్న దర్శకుడికి మాతృ వియోగం తీరని బాధని కలిగించింది. నెక్స్ట్ సందీప్ క్రైమ్ థ్రిల్లర్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: