బాబీ డైరెక్షన్ లో విక్టరీ వెంకటేష్ , యువ సామ్రాట్  నాగ చైతన్య నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం వెంకీమామ.  గత రెండు నెలలుగా నిర్విరామంగా షూటింగ్  జరుపుకున్న ఈ చిత్రానికి ఎట్టకేలకు  బ్రేక్ పడింది. ఇటీవల సినిమా షూటింగ్ లో భాగంగా వెంకీ గాయపడడంతో ప్రస్తుతం షూటింగ్ బ్రేక్ ఇచ్చారు.  మరో 25 రోజుల షూటింగ్ మిగిలివుంది. ఈ సినిమా ను మొదట దసరా కానుకగా అక్టోబర్ 4న విడుదలచేయాలనుకున్నారు కానీ  ఇప్పుడు షూటింగ్  ఆలస్యం అవుతుండడం  అలాగే  అదే సమయంలో  మెగా స్టార్ చిరంజీవి  నటించిన పీరియాడికల్ మూవీ  సైరా  కూడా విడుదలకానున్నడంతో  వెంకీ మామ ను  వాయిదా వేశారు. 



ఇక  దసరా మిస్ కావడంతో ఈ చిత్రాన్ని దీపావళికి  విడుదలచేయడానికి  సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.  సినిమా విడుదలకు కూడా అదే సరైన సమయం. ఎందుకంటే  దీపావళి రేస్ లో  స్టార్ హీరోల సినిమాలు ఏమి  లేవు. దాంతో  వెంకీ మామా కు అడ్వాంటేజ్ కానుంది.  కామెడీ ఎంటర్ టైనర్ గా  తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  వెంకీ కి జోడిగా  హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా  నాగ చైతన్య కు జోడిగా రాశి ఖన్నా నటిస్తుంది.  తమన్ సంగీతం అందిస్తున్నాడు. 



 సురేష్  ప్రొడక్షన్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ల ఫై సురేష్ బాబు , టిజి విశ్వప్రసాద్  సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఫై మంచి అంచనాలు ఉన్నాయి.  కాగా  నాగ చైతన్య  ఈ సినిమాతో పాటు మరో సినిమాను కూడా లైన్లో పెట్టాడు. అందులో భాగంగా చైతూ మొదటి సారి  శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నటించనున్నాడు.  ఈనెల 25నుండి ఈ సినిమా షూటింగ్  ప్రారంభం కానుంది.  అయితే  వెంకటేష్ మాత్రం వెంకీ మామ తరువాత  ఇంకా కొత్త సినిమాకు సైన్ చేయలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: