పంజా వంటి సినిమాలలో చిన్న పాత్రలు పోషించిన అడవి శేష్ ఆ తర్వాత హీరోగా మారాడు. అయితే అందరిలా కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవడానికి ట్రై చేశాడు. అందుకే ఈ యంగ్ హీరో నుండి క్షణం, గూఢాచారి వంటి ప్రయోగాత్మకమైన సినిమాలు వచ్చి ఇండస్ట్రీ మొత్తం ఆకర్షించడమే కాకుండా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీలో ప్రయోగం చేయాలంటే ఎంతో ధైర్యం కావాలి. రిజల్ట్ ఏమాత్రం బెడిసి కొట్టినా కనుమరుగవక తప్పదు. అయినా మొండి ధైర్యంతో, తనమీద తనకున్న అపారమైన నమ్మకంతో మళ్ళీ ఒక ప్రయోగం చేసి ప్రేక్షకుల మీదకు వదిలాడు అడవి శేష్. ఆ ప్రయోగం పేరే ఎవరు.  

ఈ హీరో ఎప్పటికప్పుడు టాలీవుడ్ లో వరుస ప్రయోగాత్మక సినిమాలలో నటిస్తూ తన విలక్షణతను చాటుకుంటున్నాడు. కమర్షియల్ సినిమాలకు భిన్నంగా తెరకెక్కుతున్న సినిమాలలో నటిస్తున్న శేష్ తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంటున్నారు. ఐతే ప్రయోగాత్మక సినిమాలతో అద్భుతమైన విజయాలను అందుకోవడమనేది ఇక్కడ గొప్ప విశేషం. అందుకు ఎవరు సినిమా విజయమే పెద్ద ఉదాహరణగా కనిపిస్తుంది. ఎవరు సినిమా పై టాలీవుడ్ ప్రముఖులతో పాటు, సాధారణ ప్రేక్షకుల వరకు ప్రశంసలు కురిపిస్తున్నారు. పట్టు సడలని సన్నివేశాలు, ఊహకు అందని మలుపులతో తెరకెక్కిన ఎవరు సినిమా వసూళ్ల పరంగా కూడా దూసుకుపోతుంది. 

ఒకే రోజు ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగే సంభాషణల మధ్య నడిచే సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిన స్క్రీన్ ప్లే ప్రేక్షకులను బాగా కట్టిపడేసింది. దర్శకుడు వెంకట్ రాంజీ ప్రతిభతో పాటు, అడివి శేషు, రెజీనాల నటన ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. టాలీవుడ్ కి ఇలాంటి మంచి సినిమాలు అందిస్తున్న అడివి శేషుని అభినందించకుండా ఉండలేం అంటు టాలీవుడ్ ప్రముఖులు కితాబిస్తున్నారు. ఇక ఇదే సినిమాని బాలీవుడ్ లో రూపొందించే దిశగా కూడా ప్రయత్నాలు మొదలైనట్టు తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: