మెగా స్టార్ చిరంజీవి 151వ చిత్రంగా `సైరా` అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, రేనాటి సూర్యుడుగా కొలవబడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం అందిస్తున్నారు. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్పై రాం చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతాన్ని అందిస్తున్నారు.
ఇక 200 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కబోతున్న ఈ చిత్రం మంగళవారం విడుదల అయిన టీజర్తో సురేందర్ రెడ్డి తన సత్తా చూపించాడు. అలాగే ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా కనిపించబోయే చిరంజీవి గెటప్ కూడా మెగా అభిమానులను ఆనందింపచేశాయి. చిరంజీవి కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. అయితే ఈ చిత్రం టీజర్లో పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ చేయడం జరిగింది.
ఈ క్రమంలో ఎంతో డెప్త్, ఎమోషన్తో పలకాల్సిన డైలాగ్స్ పవన్ చాలా నీరసంగా, డల్ చెప్పడంతో మెగా ఫ్యాన్స్కి నచ్చడం లేదు. ఇలాంటి వాయిస్ ఓవర్కు ఎన్టీఆర్ అయితే చాలా బాగా చెబుతాడని కొందరు అంటున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్- రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు కాబట్టి వాయిస్ ఓవర్కు ఎన్టీఆర్ నో చెప్పలేడు. ఇక మరికొందరు పవన్ వాయిస్ ఓవర్ సినిమాకు ప్లస్ అవుతుందని అంటున్నారు.
అలాగే టీజర్లో వినిపించన మాటలే కాకుండా పవన్ సినిమాలో వాయిస్ ఓవర్ చాలా ఉందంటున్నారు. కానీ పవన్ వాయిస్ ఓవర్పై మిక్డ్స్ టాక్ రావడంతో రామ్ చరణ్ ఏం చేస్తాడో చూడాలి. ఇక ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు వంటి వారు స్పెషల్ ఎట్రాక్షన్ కాబోతున్నారు.