ఇంకో వారం రోజుల్లో వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో విడుదల కాబోతున్న సాహో సినిమాపై అంచనాలు గంటగంటకు పెరిగిపోతున్నాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దాకపూర్ జంటగా తెరకెక్కిన సాహో సినిమాపై వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలే నెలకొన్నాయి. ఆ అంచనాలు సాహో ఖచ్చితంగా అందుకుంటుందని ధీమాతో సాహో టీం ఉందని ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చూస్తే తెలుస్తుంది. ఇక ప్రభాస్ కూడా ముంబై లోనే మకాం వేసి నేషనల్ మీడియాకి నాన్ స్టాప్ గా ఇంటర్వూస్ ఇవ్వడమే కాకుండా, అక్కడ  బుల్లితెర మీద పాపులర్ షోస్ లో తన హీరోయిన్స్ తో కలిసి సాహో సినిమాని ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాని యువ దర్శకుడు సుజిత్ చాలా బాగా హ్యాండిల్ చేసాడని సాహో మేకింగ్స్ లోను, ట్రైలర్ తోనూ అందరూ ఓ అంచనాకి వచ్చేసారు. 

సాహో మొత్తం భారీ యాక్షన్ తో నిండిపోయి హాలీవుడ్ సినిమాలా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేలా కనిపిస్తుంది. అయితే సాహోకి మెయిన్ హైలెట్స్ రెండే రెండు ట్విస్ట్స్ అంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. అందులో మెయిన్ గా క్లైమాక్స్ ట్విస్ట్ ఒకటి కాగా.. రెండోది ఇంటర్వెల్ బ్యాంగ్ ట్విస్ట్ అంటున్నారు. క్లైమాక్స్ లో వ‌చ్చే ట్విస్ట్ ప్రేక్షకులకు థ్రిల్ క‌లిగిస్తుంద‌ని తెలుస్తోంది. అప్ప‌టి వ‌ర‌కూ న‌డిచిన క‌థ ఒక ఎత్త‌యితే… ఆ ట్విస్టు సినిమాని మ‌రో స్థాయికి వెళుతుందంటూ  ప్రచారం జరుగుతుంది.

అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే ట్విస్ట్ కూడా అందరిని ఆశ్చర్యంలో పడేస్తుందట. అసలు క్లైమాక్స్ ట్విస్ట్ తో పాటుగా ఇంటర్వెల్ ట్విస్ట్స్ నచ్చే ప్రభాస్ సాహో కథకి ఒకే చెప్పాడంటున్నారని లేటెస్ట్ న్యూస్ బాగా వైరల్ అవుతోంది. అలాగే సినిమాలో ఒక యాక్షన్ పార్ట్.. దాదాపు 15 నిమిషాల పాటు వచ్చే ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ కూడా సినిమాకి మెయిన్ హైలెట్ గా నిలవబోతుందట. మరి ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ ట్విస్ట్ లే సినిమాకి కీలకం అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. మరి సినిమా మొత్తం లో ఇవి రెండే హైలెట్ అయితే సరిపోదు కదా ముఖ్యమైన కథ కూడా కీలకమే కదా అంటు మరోవైపు నుండి కామెంట్స్ వస్తున్నాయి. చూద్దాం సాహో రిలీజయ్యాక ఎలాంటి సంచలనాలను క్రియోట్ చేస్తుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: