టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చాలా కూల్ గా ఉంటూ తన ఫ్యాన్స్ ని డాల్లింగ్ అంటూ ముద్దుగా పలకరిస్తుంటారు. ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత జాతీయ స్థాయి నటుడిగా ఎదిగిన విషయం తెలిసిందే. అయితే ఎంత గొప్ప స్థానంలో ఉన్న ప్రభాస్ మాత్రం చాలా నిడారంబరంగా, నెమ్మదిగా కనిపిస్తుంటారు. అలాంటి ప్రభాస్ ఇప్పుడు బాలీవుడ్ లో జోరు కొనసాగిస్తున్నాడు. తాను నటించిన ‘సాహూ’ మూవీ ప్రమోషన్ లో భాగంగా హిందీలో ప్ర‌ముఖ టీవీ రియాలిటీ షోస్ అన్నింటికి హాజ‌రై త‌న సినిమాకి సంబంధించిన విష‌యాలు షేర్ చేసుకుంటున్నాడు. 

తాజాగా ప్రభాస్ సీనియర్ నటి రవీనా టండన్ చీర కొంగు నోట్లో పెట్టుకొని చిందులు వేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  రీసెంట్‌గా సల్మాన్‌ ఖాన్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘నచ్‌ బలియే 9’ డ్యాన్స్‌ రియాల్టీ షోలో పాల్గొన్నారు ప్ర‌భాస్‌. షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న ప్రముఖ నటి రవీనా టాండన్‌ చీర కొంగును నోటితో పట్టుకుని.. ‘కిక్‌’ సినిమాలోని ‘జుమ్మేకీ రాత్‌ హై..’ పాటకు స్టెప్పులు వేశారు ప్ర‌భాస్‌. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, సుజీత్‌ దర్శకత్వంలో వస్తున్న 'సాహో'లో నీల్‌ నితిన్‌ ముఖేష్‌, జాకీ ష్రాఫ్‌, అరుణ్‌ విజయ్‌, మురళీ శర్మ, వెన్నెల కిశోర్‌, మందిరా బేడీ తదితరులు నటించిన సంగతి తెలిసిందే.

బాహుబలి, బాహుబలి 2 సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.  భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ మూవీ హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ సీన్లు ఉన్నాయి. సినిమా కు సంబంధించిన ట్రైలర్ ఈ మద్య రిలీజ్ చేశారు.  అయితే సాహూ మూవీకి యు/ఎ సర్టిఫికెట్ ఇవ్వబోతున్నట్లు సెన్సార్ వారు ప్రకటించారని వార్తలు వస్తున్నాయి. భారీ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను థ్రిల్ కు గురి చేయడం ఖాయమని అంటున్నారు , మొత్తానికి ప్రభాస్ ఫ్యాన్స్ కు విజువల్ ఫీస్ట్ అని తేలింది . సెన్సార్ టాక్ ప్రకారం బాగానే ఉంది సాహో . అయితే అసలైన తీర్పు మాత్రం ఇవ్వాల్సింది ప్రేక్షకులే...వాళ్ళు ఇచ్చేదే నిజమైన తీర్పు దాంతో వాళ్ళు ఏం చెబుతారు అన్నది మాత్రం ఆగస్టు 30 న తేలనుంది .


మరింత సమాచారం తెలుసుకోండి: