సినిమా హిట్ కొట్టడం అనేది ఒక ఆర్ట్.. అది లక్ మీద ఆధారపడి ఉంటుందని కొందరు అంటారు. కాని ఓ సినిమాకు పూర్తి ఎఫర్ట్ పెట్టి కష్టపడితే దానికి రావాల్సిన రిజల్ట్ వస్తుందని అందరు చెప్పే మాట. అయితే హీరోల సంగతి ఎలా ఉన్నా దర్శకులలో సినిమా హిట్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు.  


అయితే మొదటి సినిమా నుండి చేసిన నాలుగు సినిమాల్లో ఒకటే ఫార్ములా ఫాలో అవుతూ సూపర్ హిట్లు కొడుతున్నాడు. ఇంతకీ ఎవరా దర్శకుడు అంటే పటాస్ నుండి ఎఫ్-2 వరకు సూపర్ హిట్లతో దూసుకెళ్తున్న అనీల్ రావిపుడి అన్నమాట. సినిమాలో కథ ఎలా ఉన్నా ఆ కథను ప్రేక్షకులకు నచ్చేలా కథనం ఉండేలా చూసుకుంటాడు.   


పటాస్ అసలు కథ ఓ తండ్రి కొడుకుల పోలీస్ కథ.. కాని దానిలో కామెడీని జొప్పించి హిట్ అందుకున్నాడు. సుప్రీం కూడా అంతే.. రాజా ది గ్రేట్ గురించి తెలిసిందే. ఇక ఎఫ్-2తో వెంకటేష్ తో పండించిన సూపర్ కామెడీ అదిరింది. ఇలా చేసిన నాలుగు సినిమాల్లో కామెడీతో మెప్పించిన అనీల్ రావిపుడి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ తో సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్నాడు.  


ఈ సినిమాలో కూడా కథ ఎలా ఉన్నా కామెడీకి మాత్రం ఎలాంటి ఢోకా ఉండదట. భరత్ అనే నేను, మహర్షి హిట్లతో సూపర్ ఫాం లో ఉన్న మహేష్ సరిలేర్ నీకెవ్వరుతో కూడా హ్యాట్రిక్ హిట్ అందుకుంటాడని అంటున్నారు. ఈ సినిమాలో అనీల్ మార్క్ కామెడీ అసలు మిస్సవదట. ఇప్పటికే సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ హైలెట్ గా ఉండబోతుందని అన్నారు. మరి సరిలేరు నీకెవ్వరు సినిమా అనీల్ డబుల్ హ్యాట్రిక్ హిట్ ఫాంను కొనసాగిస్తుందో లేదో చూడాలి. ఈ మూవీని 2020 సంక్రాంతి రిలీజ్ ప్లాన్ చేశారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: