‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ వర్క్ ఊహించిన విధంగా చాల వేగంగా జరిగిపోతున్న పరిస్థితులలో ఈ మూవీ వర్క్ అంతా డిసెంబర్ రెండవ వారానికి పూర్తి అయిపోతుంది. ఆ తరువాత ఈ సినిమా ప్రమోషన్ కోసం మహేష్ ఒక నెలరోజులు కేటాయించినా సంక్రాంతి తరువాత మహేష్ చేయబోయే సినిమా ఏదీ ఇప్పటికి ఫిక్స్ అవ్వకపోవడం ఒక విధంగా మహేష్ ను కలవర పెడుతున్నట్లు టాక్. 

మహేష్ తో సినిమా చేయాలని ఎందరో దర్శకులు ప్రయత్నాలు చేస్తున్నా దర్శకుడు పరుశు రామ్ అత్యంత పట్టుదలతో చేస్తున్న ప్రయత్నాల స్థాయిలో ఏ దర్శకుడి ప్రయత్నాలు లేవు అన్న వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి మహేష్ కు ఇప్పటికే పరుశు రామ్ ఒక కథ చెప్పి ఒప్పించాలని ప్రయత్నించినా ఆ కథ తన బాడీ లాంగ్వేజ్ కు సరిపోదు అంటూ మహేష్ సున్నితంగా చెప్పి పరుశు రామ్ ను తప్పించదానికి ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. 

అయితే పట్టువదలని విక్రమార్కుడిలా పరుశు రామ్ మరొకథను తయారుచేసి మహేష్ ను వినమని దర్శకుడు కొరటాల శివ ద్వారా రాయబారాలు చేస్తున్నట్లు టాక్. అయితే మహేష్ దృష్టి అంతా వంశీ పైడిపల్లి పై ఉన్నా మహేష్ కోరుకునే స్థాయిలో ఇంకా వంశీ పైడిపల్లి ఒక సరైన కథను మహేష్ కోసం రెడీ పెట్టలేక పోతున్నాడు అన్న గాసిప్పులు కూడ వస్తున్నాయి. 

వంశీ పైడిపల్లి నత్తనడక పరుశు రామ్ స్పీడ్ చూస్తుంటే మహేష్ పరుశు రామ్ తో సినిమా చేయవలసిన పరిస్థితులు పరోక్షంగా ఏర్పడుతున్నాయా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈమధ్యలో దర్శకుడు సందీప్ వంగాను ఒక కథ చెప్పమని మహేష్ ఫీలర్స్ పంపుతున్నా సందీప్ దృష్టి ఇప్పుడు అంతా ‘కబీర్ సింగ్’ సక్సస్ తరువాత వచ్చిపడుతున్న బాలీవుడ్ ఆఫర్ల ఫై ఉంది అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి..    


మరింత సమాచారం తెలుసుకోండి: