నా పేరు సూర్య తర్వాత అల్లు అర్జున్ సినిమాల వేగం పెంచాడు.. ప్రస్తుతం త్రివిక్రం డైరక్షన్ లో అల వైకుంఠపురములో సినిమా చేస్తున్న బన్ని ఈ సినిమాతో పాటుగా సుకుమార్ తో సినిమా.. ఆ తర్వాత వేణు శ్రీరాం డైరక్షన్ లో ఐకాన్ సినిమా లైన్ లో ఉంచాడు. అయితే త్రివిక్రం సినిమా ఓకే చేయకముందు ఓ నూతన దర్శకుడి కథకు ఇంప్రెస్ అయ్యాడట అల్లు అర్జున్.


సుబ్బు అనే నూతన దర్శకుడు డైరక్షన్ లో బన్ని సినిమా చేయాల్సి ఉంది. కాని ఎందుకో లాస్ట్ మినిట్ లో అది క్యాన్సిల్ అయ్యింది. అయితే ఇప్పుడు బోగవల్లి ప్రసాద్ ఈ సినిమా నిర్మిస్తారని తెలుస్తుంది. బన్ని దగ్గర నుండి ఈ సినిమా కథ మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ దగ్గరకు వచ్చినట్టు అంటున్నారు.


అల్లు అర్జున్ ఇమేజ్ కు.. సాయి ధరం తేజ్ కు మధ్య చాలా తేడా ఉంది. మరి అల్లు అర్జున్ కథతో సాయి ధరం తేజ్ ఎలాంటి ప్రయోగం చేస్తున్నాడో చూడాలి. ప్రస్తుతం సాయి తేజ్ హీరోగా మారుతి డైరక్షన్ లో ప్రతిరోజు పండుగే సినిమా వస్తుంది. చిత్రలహరితో ఫాం లోకి వచ్చిన సాయి ధరం తేజ్ ఇక మీదట అదే ఫాం కొన్సాగించేలా కనిపిస్తున్నాడు.


అందుకే కథల విషయంలో అసలు తొందరపాటు లేకుండా జాగ్రత్త వహిస్తున్నాడట. అల్లు అర్జున్ ఓకే చేశాడు అంటే కచితంగా ఆ కథలో మ్యాటర్ ఉన్నట్టే.. ఆ కథతో సాయి తేజ్ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. సుబ్బు డైరక్షన్ లో బోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా సాయి తేజ్ కెరియర్ కు మంచి బూస్టప్ ఇస్తుందని చెప్పొచ్చు. త్వరలో ఈ ప్రాజెక్ట్ కు సంబందించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ త్వరలో రాబోతుంది.    
 


మరింత సమాచారం తెలుసుకోండి: