మరో ఆరు రోజులలో విడుదల కాబోతున్న ‘సాహో’ తన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. దీనితో ఈ మూవీ సెన్సార్ టాక్ అంటూ ప్రస్తుతం ఇండస్ట్రీ సర్కిల్స్ లో హడావిడి చేస్తున్న వార్తలు ఈ మూవీని కొనుక్కున్న బయ్యర్లకు కలవర పెడుతున్నాయి.రోజురోజుకు ఈమూవీ పై నెగిటివ్ ప్రచారం చేసే వారి సంఖ్య పెరిగిపోతు ఉండటంతో ప్రస్తుతం ‘సాహో’ సెన్సార్ రిపోర్ట్ పేరుతో హడావిడి చేస్తున్న వార్తల వెనుక ఇందాస్త్రీలోని ప్రభాస్ వ్యతిరేక వర్గాల హస్తం ఉంది అన్న సందేహాలు కలుగుతున్నాయి. 

ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్ అదిరిపోయింద‌ని చిత్ర బృందాన్ని అభినందించార‌ని కొంద‌రంటుంటే మరికొందరు ఈ సినిమాను చూసిన సెన్సార్ వర్గాలు పెదవి విరిచారాని ప్రచారం జరుగుతోంది.ముఖ్యంగా ఈ మూవీ ఫ‌స్టాఫ్ యావ‌రేజ్ అని సెకండాఫ్ అదుర్స్ అని యాక్ష‌న్ సీక్వెన్స్ విజువ‌ల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయని కొందరు సెన్సార్ టాక్ పేరుతో వార్తలు ప్రచారంలోకి తీసుకువస్తున్నారు. మరికొందరైతే ఈ మూవీలో అసలు కథ లేదనీ కేవలం స్క్రీన్ ప్లే ఆధారంగా ఈమూవీ పరుగులు తీస్తుందని దీనితో ఈ సినిమాకు ప్రేక్షకులు రిపీట్ కావడం కష్టం అంటూ ప్రచారం చేస్తున్నారు. 

అయితే ఈమూవీ పై నెగిటివ్ వార్తలను ప్రచారం చేస్తున్న వారు కూడ ఈమూవీలోని అబుదాబి ఎపిసోడ్ చాల బాగా వచ్చిందని చెపుతూ కథ లేకపోవడంతో ఇది కేవలం ఒక యావరేజ్ సినిమాగా మారుతుందని వార్తలను ప్రచారంలోకి తీసుకు వస్తున్నారు. ఈ వార్తలలో ఏది నిజం అన్న విషయం క్లారిటీ లేక ఈ మూవీ పై కనీవినీ ఎరుగని స్థాయిలో పెట్టుబడులు పెట్టిన బయ్యర్లు ఇప్పటి నుండి నిద్రలేని రాత్రులను గడుపుతున్నట్లు సమాచారం.

సెన్సార్ టాక్ పేరుతో హడావిడి చేస్తున్న ఈవార్తల హంగామాను చూసినవారు మాత్రం ‘సాహో’ ను దెబ్బతీయాలని పెద్ద ప్రయత్నాలే జరుగుతున్నాయి అని అంటున్నారు. దీనితో ఈమూవీ విడుదల అయిన మొదటిరోజు మొదటి షో నుండి ఈమూవీ టాక్ పేరుతో అత్యంత భారీ స్థాయిలో నెగిటివ్ ప్రచారం జరగబోతోంది అన్న స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: