ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో ఎక్కడ చూసినా అడవి శేషు కెరియర్ పైనే చర్చలు నడుస్తున్నాయి. రెండు మూడేళ్ళ క్రితం వరకు అడవి శేషు సినిమాల పరిధి కేవలం 2 కోట్ల లోపు మాత్రమే ఉండేది. అయితే అనూహ్యంగా అడవి శేషు కెరియర్ ‘క్షణం’ సినిమాతో ఊహించని మలుపు తీసుకుంది.

ఆతరువాత వచ్చిన ‘గూఢచారి’ మూవీ ఘనవిజయం సాధించడంతో ఒక్కసారిగా శేషు పేరు మారుమ్రోగిపోయింది. ఇక లేటెస్ట్ గా ఇతడు నటించిన ‘ఎవరు’ మూవీ సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు శేషు 10 కోట్ల బడ్జెట్ సినిమాలకు కల్పతరువుగా మారిపోయాడు. 

ఊహించని విధంగా శేషు కెరియర్ గ్రాఫ్ మారిపోవడంతో ఇప్పుడు చిన్న హీరోలు అంతా డిఫెన్స్ లో పడిపోతున్నట్లు సమాచారం. దీనికితోడు ఈ యంగ్ హీరో మహేష్ బాబు సొంత నిర్మాణ సంస్థ తీస్తున్న ‘మేజర్’ మూవీలో నటిస్తున్న నేపధ్యంలో ఈ మూవీ కూడ సక్సస్ అయితే ఇక ఈ హీరో కెరియర్ కు ఎదురు ఉండదు అన్న అంచనాలు వినిపిస్తున్నాయి. 

దీనితో శేషును ఆధారంగా చేసుకుని మీడియం రేంజ్ సినిమాలను తీయాలని ప్రయత్నిస్తున్న దర్శక నిర్మాతల క్యూ పెరిగిపోతున్నట్లు సమాచారం. సుమారు అరడజను మంది నిర్మాతలు తనను కథలు చెప్పమని అదేవిధంగా తమ సినిమాలలో హీరోగా నటించమని తనను అడుగుతున్నారు అంటూ శేషు స్వయంగా ఒక మీడియా మీట్ లో చెప్పాడు. అయితే తాను వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒప్పుకుని తన కెరియర్ పాడుచేసుకోను అంటూ శేషు ఇచ్చిన క్లారిటీ బట్టి ప్రస్తుతం తన సినిమాల విషయంలో ఈ యంగ్ హీరో అంతర్మధనంలో ఉన్నాడా అని అనిపించడం సహజం. అయితే క్రేజ్ ఉన్నప్పుడే అవకాశాలు అందుకోవాలి అంటూ కొందరు ఇస్తున్న సలహాలు ఇతడి నిర్ణయాలను ఎంత వరకు ప్రభావితం చేస్తాయో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: