‘సాహో’ సినిమా భారీ ఎత్తున విడుదల చేస్తున్న నేపథ్యంలో దేశంలో ఉన్న అన్ని మెట్రో నగరాలను చకచకా చుటేస్తున్నారు. ఆగస్టు 30న సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు ప్రభాస్. దేశవ్యాప్తంగా బాహుబలి సినిమాతో క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ కి ఇటీవల బెంగళూరు నగరంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. విషయంలోకి వెళితే ఇటీవల కర్ణాటక లో వరదలు అన్న సంగతి అందరికీ తెలిసిందే. దీంతో చాలామంది వరద ప్రాంతాల్లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతేకాకుండా 80 మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరో సంపూర్ణేష్ బాబు కర్ణాటకలో ఉన్న వరద బాధితులకు రెండు లక్షల రూపాయలు విరాళం ఇవ్వటం జరిగింది.


ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభాస్ కి మీడియా ప్రతినిధి షాకిచ్చే కోషన్ వేశాడు. కర్ణాటక వరదబాధితులకు సంపూర్ణేష్ బాబు విరాళం ఇచ్చారు. మీరేం చేశారు? అంటూ ప్రశ్నించడంతో ప్రభాస్ ఏమాత్రం తొణికిసలాడకుండా ``ఐ విల్ డూ మై బెస్ట్.. తప్పకుండా చేస్తాను. ఇలాంటివి జరిగినపుడు నేను సహాయం చేస్తూనే ఉన్నాను`` అంటూ జవాబిచ్చారు. దీంతో మీడియా ప్రతినిధి షాక్ కి గురయ్యారు. సాహో గురించి .. పెళ్లి గురించి.. ప్రేమకథా చిత్రాల గురించి.. అన్నిటి గురించి చకచకా సమాధానాలిచ్చిన ప్రభాస్ ఓ క్షణం తటపటాయించి ఆన్సర్ చెప్పాల్సొచ్చింది.


దీంతో ప్రభాస్ అభిమానులు కూడా మీడియా పై మండిపడుతున్నారు. ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఏమి ప్రశ్న అడగాలి అన్నది ఎవరికీ అర్థం కాదా అంటూ మీడియా పై చిరు బుర్రులడుతున్నారు. ఇదే క్రమంలో పెళ్లి గురించి ప్రశ్న కూడా ఎదురయింది. ``ప్రభాస్ అన్నయ్యా మీ పెళ్లెప్పుడు?  ఎప్పటికి పిలుస్తారు? వదినను మాకు ఎప్పుడు పరిచయం చేయారా? అన్న ప్రశ్న ఎదురైంది. దానికి ప్రభాస్ సింపుల్ గా నవ్వేస్తూ `తెలియదు` అంటూ తప్పించుకున్నారు. అలాగే అనుష్కతో ఎఫైర్ విషయమై స్పందిస్తూ .. ఇదంతా రూమర్స్ అని కొట్టిపారేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: