టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇటీవల కొన్నాళ్లుగా కెరీర్ పరంగా సరైన సక్సెస్ లేక సతమతం అయ్యారు, అలానే హీరో రామ్ కూడా కెరీర్ పరంగా సక్సెస్ లు లేక ఒకింత ఢీలా పడడం జరిగింది. అయితే అనుకోకుండా వారిద్దరూ కలిసి ఇస్మార్ట్ శంకర్ సినిమా మొదలెట్టడం, ఆ వెంటనే పూర్తి చేయడం జరిగాయి. వారు అనుకున్న విధంగా ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా, సూపర్ హిట్ టాక్ తో రన్ అయి నిర్మాతలకు కాసులు కురిపించింది. పూరి మార్క్ టేకింగ్ కి రామ్ మార్క్ డాన్స్ లు, ఫైట్లు తోడవడంతో పాటు, 

పూరి రాసిన అద్బుతమైన డైలాగ్స్ ను ఈ సినిమాలో రామ్ తెలంగాణ స్లాంగ్ లో పలికిన విధానానికి ఇస్మార్ట్ థియేటర్స్ మొత్తం విజిల్స్ తో హోరెత్తిపోయాయి. ముఖ్యంగా యువత మరియు మాస్ ఆడియన్స్ లోకి విపరీతంగా చొచ్చుకుళ్ళిన ఈ సినిమాకు హీరోయిన్లు నిధి అగర్వాల్, నాభ నటేష్ లు మరింత ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఇక ఈ ఒక్క సినిమాతో అమాంతం పూరి, రామ్ ల కెరీర్ కు మంచి బూస్ట్ లభించింది అనే చెప్పాలి. అయితే ఆ ఊపులోనే తన తదుపరి సినేమాను యూత్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తో చేస్తున్నట్లు ఇటీవల పూరి ప్రకటించారు. ఇకపోతే ఇస్మార్ట్ శంకర్ సినిమాకు హిందీ, తమిళ్ నుండి రీమేక్స్ కోసం కొద్దిరోజులుగా మంచి ఆఫర్స్ వస్తున్నాయట. 

అయితే అందులో భాగంగా ఈ సినిమా హక్కులను నేడు పూరి, ఒక ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ కు అమ్మేయడం జరిగిందని, అలానే ఆ రీమేక్ సినిమాలో హీరోగా ధనుష్ నటించనున్నారని నేడు పలు కోలీవుడ్ మీడియా మాధ్యమాల్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. నిజానికి ఈ సినిమా తెలుగులో రిలీజ్ అయి మంచి సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తున్న సమయంలో, పలువురు తమిళ హీరోలు ఈ సినిమా రైట్స్ కొందామని భావించినప్పటికీ కుదరలేదట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న వార్తల్లో నిజనిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియాలంటే మాత్రం, ఇస్మార్ట్ యూనిట్ నుండి ప్రకటన వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: