పూరీ జగన్నాథ్ తరుచు మీడియా వార్తలలో హడావిడి చేస్తూ కనిపించినా అతడి భార్య లావణ్య కూతురు పవిత్ర ఎప్పుడూ మీడియాలో కనిపించరు. అయితే పూరీ కొడుకు ఆకాష్ మాత్రం పూరీతో అప్పుడప్పుడు సినిమా కార్యక్రమాలకు వస్తూ ఉంటాడు. 

ఇలాంటి పరిస్థితులలో పూరీ జగన్నాథ్ భార్య లావణ్య తన పేరుతో ఇన్ స్టా గ్రామ్ లో ఎకౌంట్ ఓపెన్ చేయడమే కాకుండా ఆమె ‘ఫ్యామిలీ టైమ్’ పేరుతో ప్రస్తుతం తన భర్త పిల్లలతో కలిసి బ్యాంకాక్ లో హాలిడే ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనితో మీడియాకు దూరంగా ఉండే పూరీ భార్య లావణ్య ఎందుకు ఇలా హడావిడి మొదలు పెట్టింది అన్న విషయమై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.

పూరీ జగన్నాథ్ ఛార్మీతో కలిసి సినిమాలు తీస్తున్న నేపధ్యంలో వీరిద్దరి సాన్నిహిత్యం పై చాల వార్తలు వచ్చాయి. ఈ వార్తలను పూరీ ఛార్మీలు ఖండించినా ఈ వార్తల ప్రచారం ఆగడంలేదు. దీనితో ఇలాంటి నెగిటివ్ వార్తలకు అడ్డుకట్ట వేసి పూరీకి ఒక ఫ్యామిలీ ఇమేజ్ వచ్చే విధంగా లావణ్య తన వంతు ప్రత్యేకమైన వ్యూహాలు అనుసరిస్తోంది అని అనిపించడం సహజం.

 రామ్ గోపాల వర్మ శిష్యుడుగా పేరు గాంచిన పూరీ జగన్నాథ్ వర్మ వ్యక్తిగత జీవితానికి భిన్నంగా ఒక ఫ్యామిలీ వ్యక్తిగా కూడ ఎదగడానికి ప్రయత్నిస్తున్నాడు అన్న విషయం ఈ ఫోటోలను బట్టి అర్ధం అవుతుంది. వరస ఫ్లాప్ లతో సతమతమమై ఆ ఫ్లాప్ లు వల్ల ఆర్ధికంగా ఎంతో నష్టపోయి తాను ఎంతో ఇష్టపడి కట్టించుకున్న ‘కేవ్’ ను కూడ తాకట్టు పెట్టవలసిన స్థితికి చేరుకున్న పూరీకి తిరిగి ‘ఇస్మార్ట్ శంకర్’ తో అదృష్టం తలుపు తట్టడంతో ఆ ఆనందాన్ని ఇలా పూరీ తన కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నాడు అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: