టాలీవుడ్ లో ఎంతో మంది సీనియర్ తనయులు హీరోలుగా పరిచయం అయ్యారు.  కొంత మంది నిర్మాత, దర్శకులు తనయులు కూడా హీరోలుగా వెండి తెరకు పరిచయం అయ్యారు.  కృష్ణవంశి దర్శకత్వంలో ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన నటుడు బ్రహ్మాజీ.   శివ సినిమా తర్వాత జేడీ చక్రవర్తి నటించిన గులాబీ సినిమాలో కీలక పాత్రలో నటించారు బ్రహ్మాజీ.  సహ నటుడిగా, కమెడియన్, హీరోగా కూడా నటించారు బ్రహ్మాజీ. చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూనే...హీరోగా ఎదిగాడు బ్రహ్మాజీ.  ఆ తర్వాత కమెడియన్ గా తన సత్తా చాటిన విషయం తెలిసిందే.  ఓవైపు కమెడియన్, క్యారెక్టర్ పాత్రల్లో నటిస్తున్న బ్రహ్మాజీ తన తనయుడిని హీరోగా పరిచయం చేయబోతున్నాడు. 


ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించిన బ్రహ్మాజీ ఆయన తనయుడు  సంజయ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. గతంలో ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ వద్ద అసిస్టెంట్ గా చేసిన సంజయ్ ఇప్పుడు హీరోగా పరిచయం కాబోతున్నాడు. సినిమా షూటింగ్ కూడా మొదలైంది. గతంలో ఎంతో మంది హీరోలు అసిస్టెంట్ డైరెక్టర్లుగా నటించినవారే ఇప్పుడు హీరోలుగా సత్తా చాటారు.  ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇక్కడి షెడ్యూల్ పూర్తయిన వెంటనే అమలాపురం వెళ్లనుంది. అక్కడ మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేయనున్నారు.


బ్రహ్మాజీ ఓ వైపు కమెడియన్ గా నటిస్తూనే తన కొడుకును అసిస్టెంట్ డైరెక్టర్ గా మంచి అనుభవం వచ్చేలా తనకు లైఫ్ ఇచ్చిన కృష్ణవంశి వద్దనే శిష్యుడిగా జాయిన్ చేశారు. త్వరలో సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని సమాచారం అందుతోంది. బ్రహ్మాజీ తనయుడు సంజయ్ హీరోగా నటిస్తున్న మూవీలో  బ్రహ్మాజీ కూడా కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. నిత్యా శెట్టి హీరోయిన్ గా కనిపించనున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ఆనంద్ ప్రసాద్ తన భవ్య క్రియేషన్స్ లో నిర్మిస్తుండటం విశేషం. 



మరింత సమాచారం తెలుసుకోండి: