ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి, దర్శకత్వం వహించిన భాగ్య రాజా అందరికీ సుపరిచితుడే. అప్పట్లో భాగ్యరాజ తో స్టార్ హీరోయిన్లు ఎంతో మంది నటించారు. నటుడు, దర్శకుడు, నిర్మాతగా భాగ్యరాజ ఎన్నో సినిమాల్లో నటించాడు..నిర్మించాడు..దర్శకత్వం వహించారు. ఆయన తనయుడు కూడా హీరోగా రాణిస్తున్నారు. తాజాగా భాగ్యరాజ ఓ సెన్సేషన్ విషయం చెప్పిం అందరికీ షాక్ ఇచ్చారు.
తనకు గంజాయి అలవాటు ఉందని పబ్లిగ్గా చెప్పి షాక్ ఇచ్చాడు. ఒకప్పుడు తాను కూడా గంజాయికి అలవాటు పడిన వాడినేనని చెప్పారు. ఓ తమిళ మూవీ ఆడియో ఫంక్షన్ కు గెస్ట్ గా వచ్చిన ఆయన తనలాగా ఎవరూ గంజాయి కు అలవాటు పడద్దని అన్నారు. అయితే ఈ విషయం విన్నవారు భాగ్యరాజా కు గంజాయ్ అలవాటు ఉండటం ఏమిటని షాక్ అవుతున్నారు. ఈ ఫంక్షన్ లో ఆయన మాట్లాడుతూ..తనకు గంజాయి అలవాటు చాలా విచిత్రంగా వచ్చిందని అన్నారు.
వాస్తవానికి తాను ఎలాంటి దురవాట్లు లేని వాడినని, కానీ అనుకోకుండా ఈ గంజాయి అలవాటు అయ్యిందని అన్నారు. ఒకసారి తన అసెస్టెంట్ ఒకరు కోయంబత్తూర్లో గంజాయితో కూడిన సిగరెట్ను ఇచ్చాడన్నారు. తాను వద్దాన్నా వినకుండా కాల్చేలా చేశాడని, మొదట్లో అది బాగానే ఉందనిపిస్తుందని ఆ తరువాత దాని ప్రభావం చూపిస్తుందని చెప్పారు. అయితే గంజాయి తీసుకునే వారు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. అది తీసుకుంటే అనూహ్యంగా నవ్వుతూ ఉంటారు. గంజాయి అలవాటు అయిన నాకు అప్పుడప్పుడు గిల్టీగా ఫీల్ అయ్యేవాడిని..చిత్ర పరిశ్రమలోకి వచ్చి తాను ఎంతో సాధించాలని అనుకున్నాను..కానీ ఇలా దిగజారి గంజాయికి అలవాటు పడటం నీచంగా అనిపించింది. ఆ ఆలోచన రావడంతో ఎంతో కష్టపడి ఆ అలవాటు మానుకున్నానని తెలిపారు.
ప్రస్తుతం సిగరెట్ తాగడం కూడా మానేశానని చెప్పారు. ఎనర్జీ అనేది వయసును బట్టి కాకుండా మనసును బట్టి ఉంటుందన్నారు. గంజాయి వంటి అలవాటు వలన కొత్తగా ఎనర్జీ ఏమీ జనరేట్ కాదన్నారు. సినీ పరిశ్రమలో డ్రగ్స్ కి అలవాటు పడ్డవారు ఎంతో మంది ఉన్నారు. ఆ మద్య హైదరాబాద్ లో భారీస్థాయిలో డ్రగ్స్ పట్టుపడినపుడు టాలీవుడ్ పై ఎన్నో ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.