బిగ్ బాస్ లో ఈ వారం ఎలిమినేషన్ అయిపోయింది. అందరూ ఊహించినట్టుగా ఆషు రెడ్డి ఎలిమినేట్ అయింది. అందరితో కలివిడిగా లేకపోవడం, వాదనల్లో తన మాటని వినిపించకపోవడం వల్ల ప్రేక్షకులకి కనెక్ట్ కాలేకపోయింది. ఈ వారం నామినేషన్ లో ఉండడం వల్ల కొంత బయటకి వచ్చే ప్రయత్నం చేసింది. ఇదిలా ఉంచితే బిగ్ బాస్ నుండి మరో వార్త బయటకు వచ్చింది. గత కొన్ని రోజులుగా మరో వైల్డ్ కార్డ్ ఉంటుందంటూ ఊహాగానాలు వస్తున్నాయి.


ఆ ఊహాగానాల్లో ఉన్న పేర్లు మాత్రం ఆసక్తిని కలిగించేలా ఉన్నాయి. టాలీవుడ్ లో తక్కువ సినిమాలే చేసినా, తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్న నటి శ్రద్ధాదాస్, కుమారి ౨౧ ఎఫ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన హెబ్బా పటేల్, ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో తెలుగమ్మాయి అని చెప్పుకునే నటి ఈషా రెబ్బ. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారట. అయితే ఈ ముగ్గురిలో ఎక్కువగా ఛాన్స్ ఉంది ఎవరికి అని విశ్లేషిస్తే, ముందుగా తెలుగు వచ్చిన ఈషారెబ్బ పేరే వినిపిస్తుంది.


కానీ ఈషా రెబ్బ సినిమాల్లో బిజీగా ఉంది. ఈ మధ్యనే తమిళంలో ఒక సినిమాలో లీడ్ రోల్ లో చేస్తుంది. కాబట్టి ఈషా అయ్యే ఛాన్స్ లేదు. ఇటు తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉన్న ఈషా అయ్యే అవకాశం ఎక్కువగా కనిపించట్లేదు. ఇక  హెబ్బా పటేల్ మొన్న మొన్ననే ఇండస్ట్రీకి వచ్చింది. కాబట్టి ఆమెకు తెలుగు ఎక్కువగా రాదు. అదీ గాక  ప్రస్తుతం ఆమె సినిమాల గురించి తప్ప వేరే వాటి గురించి ఆలోచించట్లేదని సమాచారం.


సో ఇక మిగిలింది శ్రద్ధాదాస్. శ్రద్ధా దాస్ తెలుగులో  చాలా సినిమాలు చేసింది కావున ఆమెకు భాష పరంగా ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. అదీ గాక ప్రస్తుతం శ్రద్ధా సినిమాలు కూడా చేయట్లేదు. కాబట్టి శ్రద్ధా దాస్ అయ్యుంటుందని ఊహిస్తున్నారు. మరి వైల్డ్ కార్డ్ ఉంటుందా? ఉంటే ఎవరు వస్తారనే టాపిక్ మరింత ఆసక్తికరంగా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి: