టాలీవుడ్ సినిమా పరిశ్రమకు రామ్ సరసన నటించిన నేను శైలజ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్, తొలి సినిమాతోనే కుర్రకారు మనసు దోచింది. అంతేకాక ఆ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకోవడంతో కీర్తికి టాలీవుడ్ లో అవకాశాలు కూడా బాగానే వచ్చాయి. ఆ తరువాత నాని హీరోగా ఆమె నటించిన నేను లోకల్ మూవీ కూడా మంచి హిట్ సాధించి, కెరీర్ పరంగా కీర్తి కి మంచి పేరు తీసుకువచ్చింది. అయితే తదనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఆమె నటించిన అజ్ఞాతవాసి మాత్రం అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఆ తరువాత దిగ్గజ నటి సావిత్రి గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన కీర్తి, 

ఆ పాత్ర ద్వారా విమర్శకుల నుండి కూడా ప్రశంశలు అందుకుంది. ప్రేక్షకుల మన్ననలతో సూపర్ హిట్ గా నిలిచిన ఆ సినిమాలోని ఆమె అద్భుత నటనకు గాను, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమెకు ఉత్తమ నటి అవార్డు కూడా ప్రకటించడం జరిగింది. ఇక ప్రస్తుతం ఆమె నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీకి 'మిస్ ఇండియా' అనే పేరు నిర్ణయించడం జరిగింది. నా నువ్వే సినిమాతో టాలీవుడ్ నిర్మాతగా అడుగుపెట్టి ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ ని నెలకొల్పిన మహేష్ ఎస్ కోనేరు నిర్మాణంలో ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కొత్త దర్శకుడు నరేంద్ర దర్శకుడుగా పరిచయం అవుతుండగా, యువ సంగీత తరంగం థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ టీజర్ ని కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. అటు ట్రెడిషనల్ గాను, 

ఇటు మోడరన్ గాను ఈ టీజర్ లో దర్శనమిచ్చిన కీర్తి సురేష్, ఇందులో ఒక విభిన్న తరహా పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ టీజర్ ని బట్టి చూస్తే, సినిమాలో ఎక్కువ భాగం విదేశాల్లో షూటింగ్ జరిగినట్లు మనకు కొంత అర్ధం అవుతుంది.  ప్రస్తుతం రిలీజ్ అయిన ఈ టీజర్ కు వీక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో మిస్ ఇండియా సినిమా యూనిట్ ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. రాజేంద్ర ప్రసాద్, నదియా, సీనియర్ నటుడు నరేష్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ లో రిలీజ్ చేసేలా దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ సినిమా కీర్తి సురేష్ కు ఎటువంటి విజయాన్ని అందిస్తుందో వేచి చూడాలి....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: