2018కిగాను  జాతీయ ఉత్తమ చిత్రం గా అవార్డును  గెలుచుకుంది  బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ అంధధూన్ . ఇప్పుడు ఈ సినిమా  ను సౌత్ లో రీమేక్  చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.  అందులో భాగంగా  ఈసినిమా తమిళ  రీమేక్ హక్కులను  సీనియర్ హీరో ప్రశాంత్  తండ్రి  త్యాగరాజన్  సొంతం చేసుకున్నారు.  ప్రశాంత్ హీరోగా  తెరకెక్కనున్న ఈచిత్రం  త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. 



ఇక అంధధూన్ తెలుగు  హక్కుల కోసం ఏషియన్ సినిమాస్ అధినేత  సునీల్ నారంగ్ ,అభిషేక్  నామ , కోనేరు సత్యనారాయణ  తదితరులు పోటీ పడ్డారు. కానీ యువ హీరో నితిన్ ఈ సినిమాపై ఆసక్తి  చూపించడం తో  చివరి నిమిషం లో  భారీధర  పెట్టి  ఈ హక్కులను సొంతం చేసుకున్నాడు. దాంతో నితిన్  ఈసినిమా  చేయనున్నాడని  ఖరారు అయ్యింది. 




అయితే నితిన్ ప్రస్తుతం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా  మూడు సినిమా లతో  బిజీ గా వున్నాడు. అందులో  భాగంగా ప్రస్తుతం  వెంకీ కుడుముల డైరెక్షన్ లో  'భీష్మ' అనే చిత్రాన్ని చేస్తున్నాడునితిన్. ఇటీవలే ఈ చిత్రం  యొక్క షూటింగ్  స్టార్ట్ కాగా ప్రస్తుతం  రెండవ షెడ్యూల్ షూటింగ్  జరుగుతుంది. క్రిస్మస్కు ఈ చిత్రం  విడుదలకానుంది.  ఇక ఈ సినిమాతో పాటు నితిన్, తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి  డైరెక్షన్ లో 'రంగే దే' సినిమాలో నటిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో  కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుంది. ఈ రెండు కాకుండా సాహసం ఫేమ్ చంద్రశేఖర్ యేలేటి తో కూడా ఓ సినిమా చేయనున్నాడు నితిన్. ఇవ్వన్నీ పూర్తి చేసిన  తరువాత  నితిన్, అంధధూన్ రీమేక్  ను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు.   మరి ఈ సినిమా ను ఎవరు డైరెక్ట్ చేస్తారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: