ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలతో పాటుగా బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తుంది రకుల్ ప్రీత్ సింగ్. రీసెంట్ గా బాలీవుడ్ టాలీవుడ్ లలో సీనియర్ స్టార్స్ తో నటిస్తూ షాక్ ఇస్తుంది రకుల్. బాలీవుడ్ లో అజయ్ దేవగన్ తో చేసిన దే దే ప్యార్ దే సినిమా సూపర్ హిట్ అవగా తెలుగులో నాగార్జునతో చేసిన మనథుడు-2 మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు.  


తెలుగు, తమిళ సినిమాల్లో చేస్తున్న రకుల్ బాలీవుడ్ లో పాగా వేయాలని చూస్తుంది. 2011 లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రకుల్ కు ఇప్పటివరకు అవార్డులేవి రాలేదు. ఈ విషయంపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా అప్పుడే ఏమైంది ఇంకా చేయాల్సింది చాలా ఉంది.. రానున్న రోజుల్లో అవార్డులు వస్తాయంటూ చెప్పింది రకుల్.  


అయితే లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు తాను దూరమంటూ వస్తున్న వార్తలపై కూడా స్పందించింది రకుల్. సినిమా కథే హీరోయిన్ ను ఎంచుకుంటుందని.. తన దగ్గరకు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు వస్తే తప్పకుండా చేస్తానని అంటుంది రకుల్. స్పైడర్ తర్వాత కెరియర్ లో వెనుకపడినట్టు అనిపించిన రకుల్ మళ్లీ తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటుంది.  


తమిళంలో కూడా అమ్మడికి పెద్దగా అవకాశాలు రావట్లేదు. గ్లామర్ విషయంలో అడ్డు గోడలేవి అసలు లేవంటున్న రకుల్ సినిమాకు అవసరాన్ని బట్టి తను స్కిన్ షోకి నో చెప్పనని అంటుంది. స్టార్ క్రేజ్ ఉన్నా ఈ సినిమా కేవలం రకుల్ మాత్రమే చేయగలదు అనే సినిమా ఒక్కటి పడలేదు. ప్రస్తుతం హిందిలో మరో ప్రాజెక్ట్ తో పాటుగా తమిళంలో రెండు సినిమాలు చేస్తుంది రకుల్. మరి రానున్న రోజుల్లో అయినా రకుల్ కోరినట్టుగా ఛాన్సులు అందుకుంటుందో లేదో చూడాలి.      


మరింత సమాచారం తెలుసుకోండి: