టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరుగాంచిన పూరి జగన్నాథ్, గడచిన కొన్నాళ్లుగా కెరీర్ పరంగా సరైన సక్సెస్ లేక చాలావారకు సతమతం అయ్యారు. అయితే ఇటీవల ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా పూరి తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా, తొలిరోజు తొలి ఆట నుండి మంచి టాక్ సంపాదించి సూపర్ హిట్ దిశగా ముందుకు దూసుకెళ్లి అద్భుతమైన కలెక్షన్లు రాబట్టింది. ఇకపోతే ఈ సినిమా విజయం ఇచ్చిన మంచి జోష్ తో, పూరి తన నెక్స్ట్ సినిమాను టాలీవుడ్ యూత్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో చేయబోతున్నట్లు ఇటీవల ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. 

పూరి టూరింగ్ టాకీస్ బ్యానర్ పై నటి ఛార్మితో కలిసి పూరి ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా నిర్మయించనున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా దివంగత నటి శ్రీదేవి కూతురైన జాన్వీ కపూర్ నటించనుంది అంటూ కొద్దిరోజులుగా వార్తలు ప్రచారం అయ్యాయి. ఇటీవల అటువంటిదే ఏమి లేదని జాన్వీ తండ్రి బోనీ కపూర్ ఆ పుకార్లను కొట్టిపారేయడం జరిగింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ స్టేటస్ లో కొనసాగుతున్న ఒక నటిని ఎంపిక చేసినట్లు ఫిలిం నగర్ వర్గాల నుండి వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఆమె మరెవరో కాదు రకుల్ ప్రీత్ సింగ్ అని అంటున్నారు. 

దర్శకుడు పూరి, రెండు రోజుల క్రితమే రకుల్ కు స్టోరీ చెప్పడం జరిగిందని, విన్న తరువాత స్టోరీ ఆమెకు బాగా నచ్చడంతో వెంటనే సినిమా చేయడానికి రకుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. తాను కూడా ఎప్పటినుండో పూరి గారి దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని భావిస్తున్నానని, అలానే విజయ్ సరసన కూడా అవకాశం కోసం కూడా ఎదురుచూసినట్లు చెప్పిందట రకుల్. అయితే దీనిపై పూరి నుండి  కానీ, రకుల్ నుండి కానీ ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోవడంతో, ఈ వార్తలను పూర్తిగా నమ్మలేమని, ఒకవేళ ఇది కనుక నిజం అయితే మాత్రం, తొలిసారి పూరి డైరెక్షన్ లో విజయ్ మరియు రకుల్ కాంబినేషన్ ను తెరపై చూడవచ్చని అంటున్నారు సినీ విశ్లేషకులు.......!!  


మరింత సమాచారం తెలుసుకోండి: