హీరోగా నటించిన మొదటి సినిమా పెళ్లి చూపులతో సూపర్ హిట్ ని దక్కించుకున్న విజయ్ దేవరకొండ, ఆ తరువాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో మరొక విజయాన్ని అందుకోవడం తో పాటు, ఆ సినిమాలో తన సహజ నటనతో యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ని సంపాదించడం జరిగింది. ఆ తరువాత గీత గోవిందం సూపర్ హిట్ తో ఆయన టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా ఎదిగి మంచి పేరు సంపాదించారు. ఇక ఇటీవల విజయ్ నటించిన నోటా, టాక్సీవాలా , డియర్ కామ్రేడ్ వంటి సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. 

ఇక అతి త్వరలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక మూవీలో నటించనున్న విజయ్, ఆ సినిమాతో ఒక డేరింగ్ స్టెప్ వేయబోతున్నట్లు నేడు వార్తలు వస్తున్నాయి. అదేమిటంటే, పూరితో చేయబోయే సినిమాను కేవలం తెలుగులో మాత్రమే కాక, తమిళ్ తో పాటు తొలిసారి హిందీలో కూడా రూపొందించాలని చూస్తున్నారట. ఈ సినిమాతో విజయ్ బాలీవుడ్ ఎంట్రీ చాలావరకు ఖాయమైనట్లేనని నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి సమాచారం అందుతోంది. పూరి కూడా అప్పుడెప్పుడో అమితాబ్ తో కలిసి బుద్ధా హోగా తేరా బాప్ సినిమా తరువాత హిందీలో చేయలేదని, 

ఇక ఈ సినిమాతో పూరి కూడా బాలీవుడ్ లో గట్టిగా పాగా వేయాలని చూస్తున్నాడట. ఓవైపు ఇప్పటికే పలువురు సౌత్ హీరోలు హిందీ చిత్రసీమకు ప్రవేశిస్తుండగా, తాను కూడా ఈ సినిమా ద్వారా బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తే బెటర్ అని విజయ్ నిర్ణయించి ఈ డేరింగ్ స్టెప్ వేయబోతున్నట్లు చెప్తున్నారు. మంచి ఎంటర్టైనర్ గా తెరకెక్కే ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ తో పాటు అదిరిపోయే డైలాగ్స్ కూడా ఉంటాయని టాక్. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త ప్రకారం మన రౌడీ హీరో నిజంగానే ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్లైతే, ఆయన ఫ్యాన్స్ కు ఇది పెద్ద పండుగ వార్తే అని చెప్పాలి.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: