తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్ మాస్ హీరోగా తమిళనాట తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నారు. గత కొంత కాలంగా మంచి హిట్ అందుకోలేక పోతున్నాడు. ఆ మద్య మారీ 2 వచ్చినా పెద్దగా ఆకర్షించలేక పోయాడు.  అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ధనుష్ నుంచి సినిమాలు రావడం లేదు.  కేవలం హీరోగానే కాకుండా దర్శక, నిర్మాత,రచయిత, సింగర్ గా ఎన్నో పాత్రలు పోషిస్తున్నాడు.  ఆ మద్య ధనుష్ పాడిన కొలవెరి సాంగ్ ప్రపంచ వ్యాప్తంగా ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే.

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ధనుష్ మంచి క్రేజ్ ఉంది. తమిళ చలనచిత్ర దర్శకుడు, నిర్మాత అయిన కస్తూరి రాజా కుమారుడు. అతడి సోదరుడైన సెల్వరాఘవన్ ఒత్తిడితో ధనుష్ నటనలోకి అడుగుపెట్టాడు. రజినీకాంత్ కుమార్తె అయిన ఐశ్వర్యను నవంబరు 18, 2004లో ధనుష్ వివాహమాడాడు. వీరికి ఇద్దరు కుమారులు, 2006లో యాత్ర, 2010లో లింగా జన్మించారు.  అయితే ఆ మద్య ధనుష్ పై కొన్ని కాంట్రవర్సీలు వచ్చాయి..కానీ ధనుష్ పై ఎలాంటి ప్రభావం చూపించలేక పోయాయి.

కాకపోతే ఈ మద్య ఓ కార్యక్రమంలో ధనుష్ మాట్లాడుతూ..కొందరు నిర్మాతలు నటులను మోసం చేస్తున్నారని, వారి నుంచి పారితోషికం తీసుకోవడానికి ముప్పుతిప్పలు పడాల్సి వస్తోందని ఆరోపించారు. పారితోషికం కోసం వారి చుట్టూ తిరుగుతూ ఇతర పనులను వదిలిపెట్టుకోవాల్సి వస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.  దాంతో అంత పెద్ద హీరో నిర్మాతలపై అభాండాలు వేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. విజయ్, అజిత్ వంటి అగ్రనటులు నిర్మాతలకు పూర్తి సహకారం అందిస్తున్నారని నిర్మాత ఏఎల్ అళగప్పన్ పేర్కొన్నారు.

ధనుష్ నుంచి సహకారం లేకపోవడంతో నిర్మాతలు నష్టపోతున్నారని అన్నారు. ధనుష్‌తో సినిమాలు తీసిన నిర్మాతలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. వారిలో చాలామంది ఈ రంగం నుంచే తప్పుకున్నట్టు తెలిపారు.  ఈ నేపథ్యంలో మరో నిర్మాత కె.రాజన్ మాట్లాడుతూ...ధనుష్ తో సినిమా తీసి దారుణంగా నష్టాలపాలవుతున్నామని..10 కోట్ల సినిమా నష్టాలతో 8 కోట్లకు అమ్మాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: