సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వెరైటీ సినిమాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన వన్ నేనొక్కడినే సినిమాలో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన కృతి సనన్, ఆ సినిమా పెద్దగా సక్సెస్ కానప్పటికీ నటిగా తన అందం మరియు అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించింది. ఆ తరువాత నాగచైతన్య సరసన దోచేయ్ అనే సినిమాలో నటించిన ఈ భామ, ఆపై పూర్తిగా బాలీవుడ్ సినీ పరిశ్రమకే అంకితం అయింది. ఇక ప్రస్తుతం ఆమె నటించిన లూకా చుప్పి అనే సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ తో ముందుకు సాగుతోంది. 

ఇక మరికొద్దిరోజుల్లో ఆమె ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించబోతోంది. ప్రస్తుతం ఆమె నటించిన లూకా చుప్పి చిత్ర దర్శకుడైన లక్ష్మణ్ ఉఁటేకర్ రూపొందిస్తున్న ఈ సినిమా, కథ పరంగా అద్దె గర్భం అనే కాన్సెప్ట్ తో తెరకెక్కుతుందట. తన కెరీర్లో ఇప్పటివరకు ఎన్నో క్యారెక్టర్స్ లో నటించానని, అయితే తొలిసారి ఒక మంచి కాన్సెప్ట్ తో కూడిన ఛాలెంజింగ్ రోల్ లో నటించబోతున్నందుకు ఆనందంగా ఉందని అంటోంది కృతి. మిమి అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమా విశేషాల గురించి, కృతి తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా తెలియపరిచారు. మిమి అనే సినిమా కథ అత్యంత భావోద్వేగమైనది. కథ చెప్పినప్పుడు ఒకింత ఎక్సైటింగ్‌గా, కొంత నెర్వస్‌గా ఫీలయ్యాను. ఇప్పటి వరకు నేను చేయనటువంటి పాత్ర నాకు లభించింది. 

అనేక రకాల ఎమోషన్స్ పలికించే చిత్రంగా భావిస్తున్నాను. అలానే నటిగా నాకు ఇది ఒక మంచి ఛాలెంజ్ క్యారెక్టర్ అని కృతిసనన్ పేర్కొన్నారు. అంతేకాక, లైఫ్ అనేది ఊహించని అద్భుతాలతో సాగే ఓ ప్రయాణం, ఇంతకు ముందెన్నడూ లేని ప్రయాణానికి  సిద్ధం అవుతున్నాను, ఇది నాకు అత్యంత ప్రత్యేకమైనది మరియు నా హృదయానికి దగ్గరైన సినిమా అంటూ కృతి తెల్పడం జరిగింది. మంచి ఫీల్ గుడ్ స్టోరీ గా సాగే ఈ సినిమాలో నవ్వు, ఏడుపు, ఎమోషన్ వంటి అన్ని రకాల భావోద్వేగాలు కలగలిపి దర్శకుడు లక్ష్మణ్ దీనిని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకుడు ఓ చక్కటి అనుభూతిని పొందుతారని, అలానే తనకు కెరీర్ పరంగా మంచి గుర్తింపు ఇస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది కృతి. మరి ఆమె భావిస్తున్నట్లు ఈ మిమి సినిమా, షూటింగ్ పూర్తి చేసుకుని, రేపు రిలీజ్ తరువాత ఎంత మేర విజయాన్ని అందుకుని, కృతికి ఎంతటి కీర్తిని తెచ్చిపెడుతుందో తెలియాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: