మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి డైరక్షన్ లో 300 కోట్ల పైగా బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమా సైరా నరసిం హా రెడ్డి. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ ఈ సినిమా నిర్మించడం విశేషం. అక్టోబర్ 2న రిలీజ్ ప్లాన్ చేయగా సినిమా ప్రమోషన్స్ ఆల్రెడీ మొదలు పెట్టారు చిత్రయూనిట్. టీజర్ తోనే భారీ అంచనాలు ఏర్పరచుకున్న సైరా సినిమా త్వరలో సినిమాలోని మొదటి సాంగ్ రిలీజ్ చేయబోతున్నారట.


మొన్నటివరకు దేశమంతా సాహో జపం చేసింది. బాహుబలితో ప్రభాస్ కు భారీ క్రేజ్ రావడంతో ఆ ఇమేజ్ తో సాహోని బాలీవుడ్ తో పాటుగా అన్ని సౌత్ లాంగ్వేజెస్ లో రిలీజ్ చేశాడు చిత్రయూనిట్. ఇక అదే దారిలో సైరా సినిమా వస్తుంది. సాహో తర్వాత సైరా సత్తా చాటేందుకు వస్తుంది. 


సాహో మొదటి షో నుండి నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయినా సరే టాక్ తో సంబంధం లేకుండా కలక్షన్స్ తెచ్చుకుంటుంది. అయితే సాహోకి అలాంటిది జరుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ముఖ్యంగా సినిమా రన్ టైం పై చిరు నిర్ణయం ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారట. సైరా అవుట్ పుట్ పై చిత్రయూనిట్ చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నారని తెలుస్తుంది.


సాహోతో మిస్సైన టార్గెట్ సైరాతో అందుకుంటారని అంటున్నారు. మెగాస్టార్ కు బాలీవుడ్ లో కూడా క్రేజ్ ఉంది. అయితే ఈ తరం యువ ప్రేక్షకులకు చిరంజీవి గురించి తెలియకపోవచ్చు. అయితే సైరాలో అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి వంటి స్టార్స్ నటిస్తున్నారు. అందుకే ఈ సినిమాపై కూడా బాలీవుడ్ అంతా ఓ కన్నేసి ఉంచింది. మరి సైరా సంచలనాలు ఎలా ఉంటాయో చూడాలంటే అక్టోబర్ 2 వరకు వెయిట్ చేయాల్సిందే.
 


మరింత సమాచారం తెలుసుకోండి: