టాలీవుడ్ లో ప్రిన్స్ మహేష్ బాబు ఆ మద్య కొరటాల దర్శకత్వంలో ‘శ్రీమంతుడు’ సినిమాలో నటించారు.  ఈ మూవీ మంచి మెసేజ్ ఓరియెంటెడ్ కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించింది. అంతే కాదు ఈ మూవీ ని ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది కొన్ని పేద గ్రామాలను దత్తత కూడా తీసుకున్నారు.  ఆ తర్వాత వచ్చిన బ్రహ్మోత్సవం, స్పైడర్ భారీ డిజాస్టర్ గా మిగిలాయి.  మరోసారి కొరాటాల శివతో ‘భరత్ అనే నేను’ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. 

ఈ మూవీ రాజకీయ కోణంలో ఉన్నా మహేష్ నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకున్న తర్వాత వెంటనే వంశి పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’  సినిమాతో వచ్చారు.  ఈ మూవీ రైతుల గౌరవాన్ని పెంచే విధంగా ఉండటంతో మరోసారి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించింది.  దాంతో ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం కామెడీ డైరెక్టర్ అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటిస్తున్నారు మహేష్ బాబు. ఇప్పటివరకు తన తదుపరి సినిమా విషయంలో ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు. మహేష్ బాబుకి కథ వినిపించాడు కానీ ఆ విషయంపై క్లారిటీ లేదు. 

ఆ మద్య ‘గీతాగోవిందం’ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు పరుశరామ్ తో ఓ మూవీ ఉండబోతుందని అన్నారు.  కాకపోతే దానిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా మరోసారి ఈ విషయం తెరపైకి వచ్చింది.  ప్రస్తుతం మహేష్ 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత పరశురాం సినిమా ఉంటుందని సమాచారం. ఇటీవల మహేష్ ని కలిసి పరశురాం పూర్తి కథ వినిపించాడట. పరశురాం కథను ట్రీట్ చేసిన విధానం మహేష్ కి నచ్చిందట.. స్క్రిప్ట్ బాగుండటంతో మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

పరుశరాం, మహేష్ బాబు, మైత్రి మూవీ మేకర్స్ కాంబో సినిమా పక్కా అని అంటున్నారు. దీనికి సంబంధించిన అధికార ప్రకటన త్వరలోనే రానుంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించనున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కనుందో మాత్రం క్లారిటీ లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: