‘సాహో’ 350 కోట్ల గ్రాస్ కలక్షన్స్ ను అందుకోవడంతో ఈ సంవత్సరం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సంవత్సరం సూపర్ హిట్ మూవీగా పేరు తెచ్చుకున్న ‘కబీర్ సింగ్’ రికార్డులను ‘సాహో’ చెరిపివేయడంతో ఒక ఫెయిల్యూర్ టాక్ తో విడుదలైన మూవీకి ఈ రేంజ్ లో కలక్షన్స్ రావడం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 

ఈ సినిమా కలక్షన్స్ ఈ రేంజ్ లో కొనసాగుతూ ఉంటే ఈమూవీ దర్శకుడు సుజిత్ పై జరుగుతున్న నెగిటివ్ ప్రచారం మటుకు ఆగడం లేదు. దీనితో సుజిత్ మీడియాతో పాటు ప్రభాస్ అభిమానుల దాడికి భయపడి తన సెల్ ఫోన్ కూడ ఆఫ్ చేసుకుని గోవా వెళ్ళిపోయాడు. 

అయితే ప్రభాస్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సుజిత్ కోసం మనుషులను పంపించి అతడిని తన వద్దకు పిలిపించుకోవడమే కాకుండా అతడికి ప్రభాస్ అన్నివిధాల ధైర్యం చెప్పినట్లు వార్తల హడావిడి జరుగుతోంది. ఈ మూవీ బడ్జెట్ పెరిగిన విషయంలో అదేవిధంగా ఈమూవీ కథ ఎంపిక విషయంలో తన పొరపాట్లు కూడ ఉన్నాయని అందువల్ల కేవలం సుజిత్ ను టార్గెట్ చేయడం మంచిది కాదు అని ప్రభాస్ అభిప్రాయపడుతున్నట్లు టాక్.

అంతేకాదు అవసరం అనుకుంటే ‘సాహో’ బయ్యర్లకు నిజంగా నష్టాలు ఏర్పడితే ఆ నష్టాలు పూడ్చడానికి తాను సుజిత్ తో కలిసి ఒక సినిమాను చేసే ఆలోచనలు కూడ ప్రభాస్ మనసులో ఉన్నాయని అంటున్నారు. ఇది కుదరకపోతే సుజిత్ చేత ఒక చిన్న సినిమాను తన యూవీ క్రియేషన్స్ పై ఒక సినిమాను తీయించి ఆ సినిమా రైట్స్ ను ‘సాహో’ వల్ల నష్టపోయిన బయ్యర్లకు ఇచ్చే ఆలోచన కూడ ప్రభాస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో సుజిత్ ను మధ్యలో వదిలివేయకుండా ప్రభాస్ చాల హుందాగా ప్రవర్తిస్తున్నాడు అంటూ ఇండస్ట్రీలో కామెంట్స్ వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: