ఇటీవల ప్రభాస్, మరియు సుజీత్ కాంబినేషన్ లో వచ్చిన సాహో సినిమా ప్రేక్షకుల నుండి నెగటివ్ స్పందనను సంపాదించిన విషయం తెలిసిందే. ఇదివరకు హీరో ప్రభాస్, బాహుబలి సిరీస్ లో వచ్చిన రెండు సినిమాల సూపర్ హిట్స్ తో మంచి ఫామ్ లో ఉండడం, అలానే వాటి తరువాత సాహో కోసం రెండేళ్లు సమయం తీసుకోవడంతో పాటు, ఈ సినిమాకు రూ.350 కోట్ల భారీ బడ్జెట్ పెట్టి తెరకెక్కించడంతో, సినిమాపై ఆకాశమే హద్దుగా అంచనాలు పెరిగాయి. ఇక సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ మరియు వీడియో సాంగ్స్ కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ సంపాదించడంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ సహా, 

దేశంలోని సినీ ప్రేక్షకులందూ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అనే అతృతతో ఎదురుచూడ సాగారు. అయితే ఎట్టకేలకు ఇటీవల థియేటర్లలోకి వచ్చిన సాహో సినిమా, ప్రేక్షకుల అంచనాలను తలక్రిందులు చేస్తూ నెగటివ్ టాక్ ని సంపాదించడం జరిగింది. నిజానికి ఈ సినిమాకు ఎంతో భారీ స్థాయిలో ఖర్చుపెట్టిన యూనిట్, ఎంతో ఆవశ్యకమైన కథ, స్క్రీన్ ప్లే మీద శ్రద్ధ పెట్టలేకపోయారని పలు విమర్శలు వెల్లువెత్తాయి. వరుస సెలవలు కావడంతో మొదటి మూడు రోజులు బాగానే కలెక్ట్ చేసిన ఈ సినిమా, మొన్నటి నుండి చాలా చోట్ల కేవలం అత్యల్ప కలెక్షన్స్ తో ముందుకు సాగుతున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా మిగిల్చిన అనుభవంతో ప్రభాస్, రాబోయే సినిమాలపై మరింత శ్రద్ధ పెట్టె అవకాశాలున్నాయని అందరూ భావించారు. అయితే అటువంటి వారందరికీ గట్టి షాక్ ఇస్తూ, 

ప్రభాస్ మరొక్కసారి సుజీత్ తో మరొక సినిమా చేయనున్నట్లు నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి సమాచారం అందుతోంది. రెండు రోజుల క్రితం ప్రభాస్ ని కలిసిన సుజీత్, మాటల సందర్భంలో తన వద్ద ఒక కథ ఉందని చెప్పాడట. అయితే దాని స్టోరీ లైన్ చెప్పమని ప్రభాస్ అడగడంతో సుజీత్ చెప్పడం, అది విన్న ప్రభాస్ ఎంతో బాగుంది, నా ప్రస్తుత కమిట్మెంట్స్ పూర్తి అయ్యాక చేద్దాం అని సుజీత్ కు మాటివ్వడం జరిగినట్లు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త నిజమా, కాదా అనే దాని పై ఎటువంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ, ఒకవేళ నిజమే అయితే మాత్రం, మరోసారి సుజీత్ తో చేయబోయే సినిమా విషయంలో, ప్రభాస్ ఎంతో శ్రద్ధ వహించి మంచి కాన్సెప్ట్ తో సినిమా చేయాలని కోరుతున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: