టాలీవుడ్ లో కి మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది హీరోలు వచ్చారు.  మోగాబ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ‘ముకుంద’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.  ఈ హీరో తర్వాత క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ‘కంచె’ జాతీయ స్థాయి అవార్డు గెల్చుకోవడం..అందులో వరుణ్ తేజ్ కి ఎంతో పేరు వచ్చింది.  ఈ సినిమా తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లోఫర్ సినిమా డిజాస్టర్ అయినా..వరుణ్ కి మాస్ ఇమేజ్ తెచ్చెపెట్టింది. ఆ తర్వాత వచ్చిన ఒకటీ రెండు సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ తో మరో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీతో ఫ్యామిలీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్.

ఆ వెంటనే తొలిప్రేమతో మరో విజయాం అందుకున్నాడు. తాజాగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘వాల్మీకి’ మూవీలో నటిస్తున్నాడు వరుణ్ తేజ్.  ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్ చూస్తుంటే వరుణ్ తేజ్ కంప్లీట్ గా నెగిటీవ్ పాత్రలో కనిపించబోతున్నట్లు కనిపిస్తున్నాడు.  ఇక లుక్ పరంగా పాతకాలం రౌడీ, వస్తాద్ లా కనిపిస్తున్నాడు.  ఇటీవల పూజా హెగ్డే, వరుణ్ తేజ్ లుక్ చూస్తుంటే ఈ మూవీ 1980 కాలం నాటిదిలా కనిపించింది. ఈ మూవీలో ప్రముఖ దర్శకులు సుకుమార్ ఓ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇదే కాదో ‘వాల్మీకి’లో మరో ప్రత్యేకత ఉందట. ఈ మూవీలో టాలీవుడ్ లో క్రేజీ హీరో నితిన్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారట.  ఇటీవల కాలంలో చాలా సినిమాలో మల్టీస్టారర్స్ తో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యంగ్ హీరో నితిన్ ముఖ్యపాత్రలో(గెస్ట్‌రోల్) నటిస్తున్నారు. ఇప్పటికే నితిన్‌పై కీలక సన్నివేశాలు షూట్ చేసినట్లు సమాచారం. కాగా, ఈ సనిమాలో ఇదివరకే ప్రముఖ దర్శకుడు సుకుమార్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.  హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో వరుణ్‌తేజ్, పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. 14రీల్స్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో నిర్మిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: