'కుమారి 21F' ఎఫ్ చిత్రంతో టాలీవుడ్ను ఓ ఊపు ఊపేసింది హెబ్బా పటేల్. దీంతో యువతలో విపరీతమైన క్రేజ్ వచ్చింది హెబ్బాకు. మధ్యలో కొన్ని పరాజయాలు వచ్చినా.. వాటిని దైర్యంగా ఎదుర్కొంటూ కెరీర్లో దూసుకుపోతుంది ఈ బ్యూటీ. హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్గానే వుంటుంది.
'కుమారి 21F' తరువాత ఆ స్థాయిలో అభిమానులను మెప్పించలేకపోయింది. అందాలు ఒలకబోయడానికి ప్రయత్నించినా, ఎంచుకున్న కథల్లో విషయం లేకపోవడం వలన వెనుకబడిపోయింది. తాజాగా ఆమె మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, అయితే ఈ సారి ఆమె ఓకే చెప్పింది హీరోయిన్ రోల్ కోసం కాదు .. విలన్ పాత్ర కోసం.
వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా 'భీష్మ' రూపొందుతోంది. ఈ సినిమాలో నితిన్ సరసన నాయికగా రష్మిక మందన నటిస్తోంది. ఈ సినిమాలో లేడీ విలన్ పాత్ర కీలకంగా వుంటుందట. ఈ పాత్రలో హెబ్బా పటేల్ అయితే బాగుంటుందని భావించి ఆమెను సంప్రదిస్తే వెంటనే ఓకే చెప్పేసిందట. నెగెటివ్ షేడ్స్ కలిగిన ఈ పాత్రలో హెబ్బా ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి మరి.
ప్రస్తుతానికి సినిమాల్లేక తల్లడిల్లిపోతున్న హెబ్బాకు బిగ్ బాస్ నుండి కాల్ రావడంతో హ్యాపీగా హెబ్బా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలుస్తోంది. వాస్తవానికి బిగ్ బాస్ సీజన్ 2లోనే హెబ్బాకి ఆఫర్ వచ్చిందట.. అయితే అప్పటికే వరుస సినిమాలు ఉండటంతో డేట్స్ అడ్జెస్ట్ కాక బిగ్ బాస్ హౌస్కి టాటా చెప్పేసిందట. ఇక సీజన్ 2 మిస్ అయినా సీజన్ 3లో బంపర్ ఆఫర్ రావడంతో కుమారి 100 రోజుల పాటు ఎలాంటి రచ్చ చేస్తోంది చూడాలిక.
ఈ మధ్య కాలంలో హీరోయిన్లు అందరూ ప్రత్యేక పాత్రలనే కోరుకుంటున్నారు. కేవలం హీరోయిన్ కే పరిమితం కావాలని కాకుండా ఛాలెంజింగ్ రోల్స్కి ప్రాధాన్య ఇస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. ఒకప్పుడు లేడీ విలన్గా రమ్యకృష్ణ కొన్ని చిత్రాల్లో మెప్పించింది. అంతటి స్థాయిని అందుకోలేకపోయినా హెబ్బా స్టైల్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.