తెలుగు చిత్రసీమలో సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజే వేరు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్నిరకాల ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా సినిమాలు తీసి సక్సెస్ అవుతుంటారు. అందుకే తండ్రి లక్షణాలు అందిపుచ్చుకుంటూ తెలుగు తెరపై సూపర్ స్టార్గా వెలుగొందుతున్నాడు. సినిమా సినిమాకు సమంత క్రేజ్ పెంచేసుకున్న మహేష్.. ఇటీవలే 25 సినిమాలు పూర్తిచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన రెమ్మ్యూనరేషన్కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. 25 సినిమాలు పూర్తి చేసి.. 26వ సినిమా దాదాపు రెండు దశాబ్దాల క్రింద కెరీర్ ప్రారంభించిన మహేష్ బాబు.. ఇప్పటిదాకా 25 సినిమాలు పూర్తి చేశాడు. తన 25 వ సినిమాగా ‘మహర్షి’ రూపంలో ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ సక్సెస్ని తన ఖాతాలో వేసుకున్నాడు మహేష్. అదే జోష్ లో ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 26వ సినిమా 'సరిలేరు నీకెవ్వరు' షూటింగ్లో పాల్గొంటున్నాడు.
మహేష్ ఐడియా ఇదే...
మహేష్ బాబు సినిమాల్లో లాగే, బిజినెస్మెన్గా కూడా సూపర్ స్టార్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలు వ్యాపార రంగాల్లో అడుగుపెట్టిన మహేష్.. తన సినిమాలకు రెమ్మ్యూనరేషన్ తీసుకునే విషయంలోనూ ఓ ఐడియా వేశారు. ఈ నేపథ్యంలోనే రెమ్మ్యూనరేషన్ బదులుగా నాన్ థియేట్రికల్ రైట్స్ను చేజిక్కించుకోవడం మొదలు పెట్టారట మహేష్.
'సరిలేరు నీకెవ్వరు'పై ఇంప్లిమెంట్
దీంతో ఇదే ఐడియాను తన 26 వ సినిమా 'సరిలేరు నీకెవ్వరు'పై కూడా ప్రయోగిస్తున్నాడట మహేష్ బాబు. ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ను మహేష్ రెమ్యునరేషన్గా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ రూపంలో మహేష్కు 52 కోట్ల రూపాయల మేర అండనున్నాయని సమాచారం. పైగా ఈ సినిమా నిర్మాణంలో కూడా మహేష్ భాగం పంచుకుంటున్నాడు. ఇదంతా చూస్తుంటే సరిలేరు మహేష్కెవ్వరూ కదూ!.
సరిలేరు నీకెవ్వరు మూవీ
అనిల్ రావిపూడి దర్శకత్వంలో కామెడీ ఎంటర్టైనర్ సినిమాగా రూపొందుతోంది 'సరిలేరు నీకెవ్వరు' మూవీ. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ విజయశాంతి ముఖ్యపాత్ర పోషిస్తోంది.