లోకనాయకుడు కమల్ హాసన్ తనయ శృతి హాసన్, తెలుగులో సిద్దార్థ సరసన అనగనగా ఒక ధీరుడు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయితే ఆ సినిమా అప్పట్లో పెద్ద  అపజయాన్ని మూటగట్టుకోవడంతో తొలి సినిమానే శృతికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఆ తరువాత కూడా ఆమె సిద్ధార్ధ తోనే ఓ మై ఫ్రెండ్ అనే సినిమాలో నటించింది, అయితే ఆ సినిమా కూడా బోల్తా కొట్టడంతో, అమ్మడుకి టాలీవుడ్ పెద్దగా కలిసి రాదని అందరూ అనుకున్నారు. అయితే ఆ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన గబ్బర్ సింగ్ సినిమాలో హీరోయిన్ గా అవకాశం రావడం, ఆపై ఆ సినిమా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ సాధించడంతో, 

శృతికి టాలీవుడ్ లో తొలి బ్రేక్ లభించింది. ఇక ఆ తరువాత రవితేజతో బలుపు, రామ్ చరణ్ తో ఎవడు, బన్నీతో రేసు గుర్రం, మహేష్ బాబుతో శ్రీమంతుడు వంటి సూపర్ హిట్స్ లో నటించి తెలుగు ప్రేక్షకుల మదిలో మంచి స్థానాన్ని సంపాదించిన శృతి, ఆ తరువాత తెలుగు సినిమాల్లో నటించడం కొంత తగ్గించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి రెండవ సారి ఆమె జతకట్టిన కాటమరాయుడు సినిమానే హీరోయిన్ గా తెలుగులో ఆమె ఆఖరి సినిమా. ఇక అప్పటినుండి ఇప్పటివరకు ఒక్క తెలుగు సినిమా కూడా చేయని ఈ భామ, త్వరలో ఒక స్టార్ హీరో సినిమాతో మళ్ళి హీరోయిన్ గా టాలీవుడ్ కి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు, నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి సమాచారం అందుతోంది. 

ఇక అందుతున్న సమాచారం ప్రకారం, అతి త్వరలో రవితేజ మరియు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రారంభం కాబోయే సినిమాలో హీరోయిన్ గా శృతిని తీసుకోవాలని చూస్తున్నారట. నిజానికి గతంలో రవితేజ, శృతి హాసన్ కలిసి నటించిన హిట్ మూవీ బలుపుకు దర్శకత్వం వహించింది గోపించందే కావడంతో, మరొక్కసారి రవితేజతో చేయబోయే ఈ కొత్త సినిమాలో వేరే హీరోయిన్ కంటే, గతంలో తాను పనిచేసిన శ్రుతినే తీసుకుంటే బెటర్ అని భావించడంతో పాటు, తన సినిమాలోని పాత్రకు శృతిని కరెక్ట్ గా సరిపోతుందని భావించిన దర్శకుడు గోపీచంద్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే నేడు పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం అవుతున్న ఈ వార్త పై అధికారిక ప్రకటన మాత్రం వెలువడవలసి ఉంది.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: