తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 3 ఇప్పటికీ ఏడు వారాలు పూర్తవుతుంది.  గత రెండు బిగ్ బాస్ సీజన్ల కన్నా ఈసారి బిగ్ బాస్ చాలా ప్రశాంతంగా సాగుతుంది.  మొదటి వారం నటి హేమ ఎలిమినేషన్ తర్వాత ఇంటి సభ్యుల మద్య అప్పుడప్పుడు టాస్క్ పరంగా గొడవలు తప్పా ఎలాంటి గ్రూప్ మెయింటేనెన్స్ లు జరగడం లేదు.  నటి హేమ ఇంట్లో అప్పుడే గ్రూపులు మొదలయ్యాయని కామెంట్ చేసినా ఇప్పటి వరకు అలాంటిది ఎక్కడ జరగడం లేదేని వీక్షకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక వారంలో ఒకసారి కెప్టెన్సీ టాస్క్ కోసం మాత్రం నువ్వా నేనా అన్న చందంగా ఇంటి సభ్యుల మద్య యుద్దం నడుస్తుంది..తర్వాత అంత కూల్.  అయితే హేమ ఎలిమినేషన్ తర్వాత ట్రాన్స్ జెండర్ తమన్నా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రెండు వారాలు మాత్రం ఇంటి సభ్యులతో కబడ్డీ ఆడుకుంది.  ముఖ్యంగా రవికృష్ణను ఘోరంగా టార్గెట్ చేసింది.  ఇప్పటి వరకు ఇంటి నుంచి హేమ, జాఫర్, తమన్నా, రోహిణి, అర్షు ఎలిమినేట్ అయ్యారు.  వాస్తవానికి గత వారం ఒకరు ఎలిమినేషన్ కావాల్సి ఉన్నా..కింగ్ నాగార్జున తన కుటుంబ సభ్యులతో విహారయాత్రంకు పోవడంతో ఆయన స్థానంలో శివగామి రమ్యకృష్ణ శని, ఆదివారాల్లో భలే సందడి చేసింది.

అయితే తెల్లవారి వినాయకచవితి సందర్భంగా ఎవరినీ ఎలిమినేషన్ చేయలేదు. ఈ రోజు నాగార్జున రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు..మరి ఈసారి ఎలిమినేష్ ఇద్దరా..ఒక్కరా అన్న విషయం తెలియాల్సి ఉంది.    నేడు జరగబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు. ఈ ప్రోమోలో నాగార్జున పునర్నవిని టార్గెట్ చేసినట్లు కనిపిస్తున్నాడు. 

ప్రోమోలో అలీ రెజాపై  పునర్నవి.. నాగార్జున వద్ద కూడా గట్టిగానే వాదిస్తోంది. అయితే ఆ ఇద్దరికీ నాగ్ గట్టి కౌంటర్ కూడా ఇచ్చినట్లు కనిపిస్తుంది. ఈ వారం నామినేషన్ లో మహేష్, రవి, అలీ రెజా, శ్రీముఖి, రాహుల్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: