టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటించిన ‘మల్లీశ్వరి’మూవీలో తన అందాలతో కుర్రాళ్ల మనసు కొల్లగొట్టిన బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. ఆ తర్వాత తెలుగు లో ఈ బ్యూటీ ఒక్కసినిమాలో కూడా నటించలేదు. బ్రిటిష్ నటి మోడల్ గా రాణిస్తున్న కత్రినాకు అనుకోకుండా బాలీవుడ్ లో ఛాన్స్ దొరికింది. మొదటి మూవీలోనే బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ తో నటించే ఛాన్స్ దొరికింది. ఆమె తండ్రి కశ్మీరీ కాగా, తల్లి బ్రిటన్ కు చెందినవారు. 2009లో ఉగ్రవాదం గురించి తీసిన న్యూయార్క్ సినిమాలో ఆమె నటనతో ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమాతో ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారానికి నామినేషన్ పొందారు కత్రినా. ఆ తరువాత అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ (2009), రాజ్నీతీ (2010), జిందగీ నా మిలేగీ దుబారా (2011) సినిమాల్లో నటించారామె.
మేరే బ్రదర్ కీ దుల్హన్ (2011) సినిమాతో రెండో ఫిలింఫేర్ ఉత్తమ నటి నామినేషన్ అందుకున్నారు. బాలీవుడ్ లో కత్రినా అనగానే వెంటనే సల్మాన్ ఖాన్ గుర్తుకు వస్తాడు. ఎందుకంటే వీరిద్దరి అనుబంధం అలాంటింది. కత్రినా కైఫ్ చివరగా నటించిన మూవీ భారత్. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ఈ మూవీ పర్వాలేదనిపించింది. ఇక కత్రినా కైఫ్, సల్మాన్ ఖాన్ రిలేషన్ గురించి చాలా రోజులుగా బాలీవుడ్ లో ఊహాగానాలు ఉన్న సంగతి తెలిసిందే. ఆ మద్య సల్మాన్ ఖాన్ ప్రేమలో మునిగిపోయినట్లు తెగ వార్తలు వచాయి. ఆ తర్వాత వీరిద్ద మద్య విభేదాలు తలెత్తడంతో బ్రేకప్ చెప్పుకున్నారట. ఆ తర్వాత ఆ తర్వాత రణబీర్ కపూర్ తో సహజీవనం చేసింది. ఆ మద్య రణ్ బీర్, కత్రినా కు సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. ఇక 2017లో ఈ జంట విడిపోయింది. దీనితో కత్రినా కైఫ్ మరోసారి సల్మాన్ ఖాన్ చేరువైనట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా సింగపూర్ కు ఓ కార్యక్రమం కోసం వెళ్లిన కత్రినా సల్మాన్ ఖాన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో కత్రినా మాట్లాడుతూ..సినీ పరిశ్రమలోకి వచ్చిన తర్వాత నాకు ఎంతో ధైర్యం చెప్పిన మంచి వ్యక్తి సల్మాన్ ఖాన్. ఇక్కడ అంతా కొత్త అయినా..నటన తో మెప్పించాలని ఎన్నో సలహాలు ఇచ్చేవారు. అందుకే అతనితో సన్నిహితంగా ఉండటంతో చాలా మంది రక రకాలుగా భావించారు. బాలీవుడ్ లో నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. నన్ను ఎవరూ పట్టించుకోలేదు. ఆ సమయంలో నన్ను ఆదుకున్న ఏకైన వ్యక్తి సల్మాన్ ఖాన్ అని కత్రినా తెలిపింది. ఇతరుల కష్టాలని అర్థం చేసుకుని సాయం చేసే మనస్తత్వం ఆయనది అంటూ సల్మాన్ ని ఒక రేంజ్ లో కత్రినా ఆకాశానికి ఎత్తేసింది. మా మద్య ఉన్నది స్నేహసంబంధం మాత్రమే అంటుంది కత్రినా కైఫ్.