సినిమాలో నుంచి విరమణ తీసుకున్న తరువాత నేను రాజకీయాల్లోకి వస్తానని, ఏమో నాకు తెలియదు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు, అని అనే రాంగోపాల్ వర్మ ఇటీవల అదే పనిలో ఉన్నారేమో అనిపిస్తోంది. సినిమాలు తీయడం పైన దృష్టిని తగ్గించి రాజకీయాలపైన వర్మ దృష్టి పెరిగిందనే చెప్పాలి. ప్రపంచంలో దేశంలో మరియు రాష్ట్రంలో ఎక్కడ ఏ మూల ఎటువంటి వార్త వచ్చినా దానికి సంబంధించి ఏదో విధంగా చంద్రబాబునాయుడు మెడచుట్టు వ్యాఖ్యానాలు చేయడం మొదలుపెట్టారు.

అసలు ఈ విషయానికి చంద్రబాబు నాయుడు కి ఎటువంటి సంబంధం ఉంది అని ఆశ్చర్యపోయే విధంగా రాంగోపాల్ వర్మ వ్యాఖ్యానాలు ఉండడంతో దీని వెనుక ఏదో గూడుపుటాని ఉంది అని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. గతంలో ఒక ఫోటో షేర్ చేసి ఈ హోటల్ లో పనిచేసే వ్యక్తి అచ్చు చంద్రబాబునాయుడు లాగే ఉన్నాడు అని సోషల్ మీడియాలో హల్చల్ చేసి నవ్వుకున్నారు. అతనికి ఆ తర్వాత లక్ష్మి ఎన్టీఆర్ సినిమాలో అవకాశం కూడా ఇచ్చారు.

ఇప్పుడు తాజాగా వర్మ తీస్తున్న సినిమా పేరు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. ఈ సినిమాలో కూడా చంద్రబాబు నాయుడు తాను లేకుండా ఉండటం అసాధ్యం. చంద్రబాబు నాయుడుకు మరియు జగన్మోహన్ రెడ్డికి మధ్య జరుగుతున్న రాజకీయ హడావిడి మీద ఈ సినిమా ఉండబోతోంది అని మనం అర్థం చేసుకోవచ్చు.

ఇక నిత్యం వర్మ తీసే ప్రతి సినిమాలోనూ ఒక పాత్ర కచ్చితంగా చంద్రబాబు నాయుడు పైన ఉంటుంది అర్థం చేసుకున్నవారు, చంద్రబాబునాయుడు లాగా కాస్తోకూస్తో కనిపించే వారు కూడా మీ దగ్గరికి వెళ్లి ఒక సినిమా అవకాశం కావాలని కోరుతున్నారట. మరి ఎంత మందికి ఈ అదృష్టం దక్కుతుందో వేచి చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: