ముంబై బ్యూటీ హెబ్బా పటేల్ తెలుగు చిత్ర సీమలోకి 'అలా ఎలా' సినిమాతో ఆరంగేట్రం చేసింది. తొలి సినిమాతోనే నటిగా ఆకట్టుకున్న హెబ్బా తర్వాత సుకుమార్ రైటింగ్స్ లో వచ్చిన 'కుమారి 21ఎఫ్' తో తన విశ్వరూపం చూపించింది. ఒకపక్క అత్యద్భుతంగా నటించి మరోపక్క తన అందాలని ఆరబోసి కుర్రాళ్ళ హృదయాలను కొల్లగొట్టేసింది. ఆ సినిమా తర్వాత తనవి ఒక రెండు మూడు సినిమాలు అలా వచ్చి ఇలా వెళ్లి పోయినప్పటికీ ఆ తర్వాత 'ఈడోరకం ఆడోరకం' మరియు 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' వంటి హిట్ సినిమాలతో నిలదొక్కున్నట్టే కనిపించింది.

 

 

అయితే ఎప్పుడో 2016లో హిట్ రుచి చూసిన ఆమె రెండు సంవత్సరాలుగా అసలు చేతిలో సినిమాలే లేకుండా పోయాయి. దీంతో ఇక చేసేదేమీలేక యంగ్ హీరో నితిన్ నటిస్తున్న భీష్మ చిత్రంలో నెగిటివ్ పాత్రకు ఒప్పుకుందట. ఆ సినిమాలో హెబ్బా క్యారెక్టర్ చాలా నెగిటివ్ గా ఉంటుందని…ఇంకా కథలో నిర్దేశక పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. గ్లామర్ లుక్ తో ఆకట్టుకునే హెబ్బా పటేల్ కు ఇప్పుడు ఈ నెగిటివ్ క్యారెక్టర్ చేయడం చాలా పెద్ద చాలెంజ్ అని చెప్పాలి.

 

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే హీరోలలాగా హీరోయిన్లు తమ సినిమాల్లో నెగటివ్ పాత్రలు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించరు. అదికూడా హెబ్బా పటేల్ లాంటి కుర్ర హీరోయిన్లు అయితే ఒకవేళ తను ఇలాంటి పాత్రలు చేస్తే ఫ్యూచర్ లో కూడా ఇలాంటి పాత్రలకే వారిని సినిమాలో తీసుకుంటారని భయంతో 'నో' చెప్పేస్తారు. కానీ హెబ్బా మాత్రం ముందుకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని తాను అన్ని పాత్రలు చేయగలను అని నిరూపించుకుని ఒక పెద్ద హిట్ తో మళ్లీ బిజీ అయిపోవాలని భావిస్తోంది. ఏది ఏమైతేనేం చాలా రోజుల తర్వాత హెబ్బా పటేల్ ను తెలుగు ప్రేక్షకులు ఒక పెద్ద సినిమాలో విభిన్నమైన పాత్రలో చూడనున్నారు. ఆల్ ద బెస్ట్ హెబ్బా.!

 

మరింత సమాచారం తెలుసుకోండి: