మెగాస్టార్ చిరంజీవి హీరోగా,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాణ సారధ్యంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నిర్మిస్తోన్న సినిమా సైరా.ఖైదీ నెంబర్ 150 తర్వాత చిరంజీవి నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.బ్రిటిష్ వారిపై తొలిసారి పోరాడిన తెలుగు ధీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, హిందీ,తమిళ, మళయాళ, కన్నడ భాషల్లో విడుదల అవ్వడానికి సిద్దమైంది.
కాగ అక్టోబర్ 2న ఈ సినిమా రిలీజ్ చేస్తారనుకున్న సమయంలో అభిమానులకు పిడుగులాంటి వార్త చెవిన పడింది.వాస్తవంగా ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయాలని భావించిన చిత్రబృందం.చిత్రానికి సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ వర్క్స్ పూర్తి అవ్వకపోవడం వల్ల ప్రకటించిన తేదీకాకుండా మరో ఆరో రోజులు తర్వాత రిలీజ్ చేయబోతున్నారట.ఇది నిజమా? కాదా? అన్నది మాత్రం ప్రొడక్షన్ హౌస్ నుంచి కానీ,చిరంజీవి నుంచి ఎటువంటి ప్రకటన ఇప్పటివరకు రాలేదట.కానీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.ఇక ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్కు భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇప్పటికే టీజర్,మేకింగ్ వీడియోను విడుదల చేశారు.ఇక పబ్లిసిటికి దూరంగా వుండడమే కాకుండా,ఆడియో ఫంక్షన్లు,సినిమాల ప్రమోషన్ల గురించి అసలు పట్టించుకోని పవన్కళ్యాణ్ ఈ పెద్దన్న సినిమా కోసం ఏకంగా ఈ చిత్రం టీజర్కి వాయిస్ ఓవర్ ఇచ్చి హైప్ క్రియేట్ చేశారు.ఇక వచ్చే వారంలో ఈ చిత్రం ట్రైలర్ కూడా విడుదల చేయబోతున్నామని చిత్రబృందం ప్రకటించింది.. ఇక ఈ సినిమాలో చిరు సరసన కేరళ బ్యూటీ నయనతార నటిస్తుండగా,బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్తో పాటు జగపతి బాబు,సుధీప్,విజయ్ సేతుపతిలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఇక ఈ సినిమాతో చిరంజీవి స్టామినా ఏంటో మరో సారి రుజువు కాబోతుంది.ఇక చిరు చేయబోయే ఈ యుద్ధంలో విజయం ఎంతవరకు వరిస్తుందో చూడాలి..