'సాహో' తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ప్రభాస్ తన తదుపరి చిత్రం 'జాన్' షూటింగ్ కోసం రెడీ అవుతున్నాడు. కె.కె.రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే కొంత జరిగింది. తాజా షెడ్యూలును వచ్చే నెలలో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. హీరో ప్రభాస్ బాహుబలి తరువాత దాదాపు అదే రేంజిలో సాహో, జాన్ సినిమాలు చేస్తున్నారు.  అయితే ఈ సినిమాకి సంబందించి యూర‌ప్ లోని లొకేష‌న్స్ కావ‌ల్సిఉంది. ఈ నేప‌థ్యంలో ఎక్కువ రోజులు విదేశాల్లో ఉండ‌టం భారీ ఖ‌ర్చుల‌తో కూడుకున్న ప‌ని, అందుకే హైద‌రాబాద్ లోనే యూర‌ప్ లాంటి గెట‌ప్ ను వేయ‌నున్నారు. దాని వ్య‌యం దాదాపు 30 కోట్లు అవుతుంద‌ట‌.


పూర్వ కాలం అన‌గా 1920 కాలం నాటి కథతో సినిమా తెరపైకి రాబోతుంది. యూరప్ లోని కొన్ని లొకేషన్స్ లో కొన్ని రోజులు సినిమా షూట్ చేశారు. అయితే, అప్పటి రోజులకు అనుగుణంగా షూటింగ్ జరగాలి కాబట్టి దానికి తగ్గట్టుగా ఓ భారీ సెట్ ను నిర్మించబోతున్నారని తెలుస్తోంది. 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమాని ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థలైన యూవీ క్రియేషన్స్ మరియు గోపికృష్ణ మూవీస్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. 


సాహో ప్రమోషన్స్ లో జాన్ సినిమా ప్రస్థావన తెచ్చిన మీడియా వాళ్లకు సమాధానంగా ఇంతవరకు ఇండియన్ సినిమాల్లో చూడని ఓ స్పెషల్ థింగ్ తన రాబోయే సినిమాలో ఉంటుందని చెప్పుకొచ్చాడు ప్రభాస్. అలా చెప్పి ఆ సినిమా మీద కూడా అంచనాలు పెంచేశాడు మన యంగ్ రెబల్ స్టార్. జిల్ తో తన సత్తా చాటిన రాధాకృష్ణ ప్రభాస్ తో మరో సెన్సేషనల్ మూవీ సిద్ధం చేస్తున్నాడు. కృష్ణం రాజు సమర్పణలో ఆ సినిమా తెరకెక్కుతుంది. చూస్తుంటే ఆ సినిమాను కూడా ప్రభాస్ తెలుగు, తమిళ, హింది భాషల్లో భారీగా రిలీజ్ చేసేలా ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: