యువ సామ్రాట్ నాగ చైతన్య , ఫిదా బ్యూటీ సాయి పల్లవి , క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ... ఈ క్రేజీ కాంబినేషన్ లో ఓ సినిమా రానుందని తెలిసిందే. లవ్ స్టోరీస్ ను తెరకెక్కించడంలో తన కంటూ ఓ ప్రత్యేకతను ఏర్పచుకున్న శేఖర్ కమ్ములతో మొదటి సారి నాగ చైతన్య -సాయి పల్లవి లు కలిసి నటిస్తుండడంతో ఈ చిత్రం ఫై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఈ చిత్రం యొక్క షూటింగ్ ఈ రోజు ప్రారంభమైంది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈచిత్రం లో చైతూ , సాయి పల్లవి లోకల్ స్లాంగ్ లో డైలాగులు చెప్పనునున్నారు. వెంకటేశ్వర సినిమాస్ , అమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలకానుంది. ఏఆర్ రహెమాన్ శిష్యుడు పవన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడని సమాచారం.
ఇక ఇదిలా ఉంటే ఇటీవల వరుస ప్లాప్స్ తో సతమతమైన నాగ చైతన్య ఎట్టకేలకు మజిలీ తో పరాజయాల పరంపరకు బ్రేక్ వేసుకున్నాడు. ఈ ఏడాది సమ్మర్ లో విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన కలెక్షన్స్ ను రాబట్టి సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం తరువాత చైతన్య , విక్టరీ వెంకటేశ్ తో కలిసి 'వెంకీ మామ' చిత్రంలో నటించాడు. కొద్దీ రోజుల క్రిందట షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈచిత్రం దీపావళి కి ప్రేక్షకులముందుకు రానుంది. కాగా సాయి పల్లవి, శేఖర్ కమ్ముల సినిమా తోపాటు ప్రస్తుతం వేణు ఉడుగల డైరెక్షన్ లో విరాటపర్వంలో నటిస్తుంది. కొద్దీరోజుల నుండి ఈ చిత్రం కూడా రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకుంటుంది.