ఈరోజు ప్రభాస్ అభిమానులు ఎవరు ఊహించని సంఘటన జరిగింది. ‘సాహో’ విడుదల తరువాత మీడియాకు దూరంగా ఉన్న ప్రభాస్ ఈ రోజు ఉదయం కొండాపూర్ దగ్గర ఉన్న మహేష్ AMB సినిమాలో ఈరోజు ఉదయం 12 గంటల షోకు ఎటువంటి హంగామా లేకుండా ప్రభాస్ ధియేటర్ కు వచ్చి జనం మధ్య కూర్చుని ‘సాహో’ ను చూడటం హాట్ న్యూస్ గా మారింది. ఎవరికి కనిపించకుండా ఒక AMB  మాల్ కు చెందినా ఒక స్పెషల్ లిఫ్ట్ ద్వారా ప్రభాస్ ‘సాహో’ ప్రదర్శింప బడుతున్న ధియేటర్ లోకి ఎంటర్ కావడం చూసి చాలామంది షాక్ అయ్యారు. 

అయితే ఈ రోజు సోమవారం వర్కింగ్ డే కావడంతో ధియేటర్ లో కూడ ప్రేక్షకులు చాలా పలచగా ఉన్నట్లు తెలుస్తోంది. ధియేటర్ ప్రభాస్ ను చూడగానే కొంతమంది ఆ ధియేటర్ కు దగ్గరలో ఉన్న తమ స్నేహితులకు ప్రభాస్ అభిమానులకు ఈవిషయం షేర్ చేయడంతో ఈవార్త బయటకు వచ్చింది. 

అయితే ఈ న్యూస్ ప్రభాస్ అభిమానులకు లీక్ అయి వాళ్ళు ధియేటర్ కు వచ్చి హడావిడి చేయడానికి ప్రయత్నించి నప్పుడు ప్రభాస్ కూడ వచ్చిన వ్యక్తులు ఎటువంటి హడావిడి చేయవద్దని సున్నితంగా వారించి నట్లు తెలుస్తోంది. అయినా ప్రభాస్ ధియేటర్ లో ఉన్న విషయాన్ని తెలుసుకుని ఇప్పటికే చాలమంది అభిమానులు ధియేటర్ వద్దకు చేరుకొని ‘సాహో’ షో పూర్తి అయ్యాక బయటకు వచ్చే ప్రభాస్ గురించి ఎదురు చూస్తున్నట్లు సమాచారం.

‘సాహో’ 350 కోట్ల గ్రాస్ కలక్షన్స్ వసూలు చేసిన తరువాత ప్రభాస్ తన ఇన్ స్టా గ్రామ్ ఎకౌంటులో తన అభిమానులకు కృతజ్ఞతలు చెప్పడం తప్ప మరి ఎక్కడా మీడియా కంట పడలేదు. ఇప్పడు ప్రభాస్ ‘సాహో’ సినిమాను చూస్తున్నాడు అని వార్తలు రావడంతో కొన్ని మీడియా వర్గాలు కూడ ఈ మూవీ ధియేటర్ వద్ద వేచి చూస్తూ ప్రేక్షకులు ఇచ్చిన తీర్పు పై ప్రభాస్ అభిప్రాయం కోరే అవకాశం ఉంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: